Tuesday, February 10, 2026

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, అవసరంలో ఉన్న ఓ నిరుపేద కార్మికుడికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, శివాజీ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న జగ్గారెడ్డికి రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కార్మికుడు కనిపించాడు. వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆ కార్మికుడి వద్దకు వెళ్లిన ఆయన, అతని జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. వాన, ఎండలకు తడుస్తూ రోడ్డుపక్కనే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని, సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కార్మికుడు జగ్గారెడ్డికి విన్నవించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనికి అవసరమైన సామగ్రి కూడా కొనుగోలు చేయలేకపోతున్నానని, కొంత సహాయం అందితే తన ఉపాధి మెరుగుపడుతుందని వివరించాడు. కార్మికుడి పరిస్థితిని గమనించిన జగ్గారెడ్డి, అతని జీవనోపాధికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వెంటనే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని చెప్పులు కుట్టే పనిముట్లు, నీడ ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

Monday, February 09, 2026

ఇంటింటి ప్రచారంలో జోష్ 37 వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్

 సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS):సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మున్సిపాలిటీలోని 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ ఇంటి సేవకుడిగా, పనిచేస్తానని పదవి కోసం రాలేదని 37వ వార్డు ప్రగతి కోసం వచ్చానని నన్ను గెలిపిస్తే కౌన్సిలర్ అవుతా కానీ ఎప్పటికీ మీ మనిషిగా ఉంటూ సేవ చేసుకుంటారని అన్నారు. 37వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు వివరించారు. వార్డు అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తానని అన్నారు. కాలనీవాసులో తన ప్రచారానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

నాయి కోటి అశ్విని నవీన్ కుమార్ లభిస్తున్న ప్రజా ఆదరణ -గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం

 


సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 32వ వార్డు అభ్యర్థి నాయి కోటి అశ్విని సవీన్ కుమార్ ఇంటింటికి తిరిగి కార్యకర్తలతో ప్రచారం చేశారు. మున్సివల్ 32 వ వార్డు అభ్యర్థి నాయికోటి అశ్వని కుమార్ మాట్లాడుతూ గత కాలంలో మేము చేసిన అభివృద్ధి మీ అందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా వ్రతి ఇంటికి తిరిగి శానిటైజషన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రతి! ఇంటికి రోజు మంచినీటి సరఫరా మరియు సొంత నిధులతో టాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వీధికి సిసి రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వార్డు రేఖలను మార్చాము. వార్డు ప్రజల సౌలభ్యం కోసం కలెక్టర్ వెనకాల పార్కును ఏర్పాటు చేశాము. వాటర్ ట్యాంక్ నిర్మించామని, డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా బిల్డింగ్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం పెంచామని అన్నారు. గతంలో చేసిన విధంగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నామని తెలియజేశారు. పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా ఉంటాను. అందరూ గర్వపడేలా పనిచేస్తాను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాలనీవాసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

సదాశివపేటలో జయమ్మ... సంగారెడ్డిలో నిర్మలమ్మ -కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న తల్లీ కూతుళ్ళు

 



-8 కోట్ల తో ఒక్కో వార్డులో అభివృద్ధి, పేదలకు ఇంటి స్థలాల హామీతో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (SNM NEWS):మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెర పడనుండటం తో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం లో దూకుడు పెంచింది. సంగారెడ్డి లో శనివారం జరిగిన  ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి  సభ వియవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.  సదాశివపేట లో జయా చైతన్య రెడ్డి,    సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఇంటిటి  ప్రచారం లో పాల్గొన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున  పట్టణం లో ని 11,31,32,33,6 వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను   గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేయడం తో పాటు వార్డులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మీ మనస్సు మాట వినండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరో పక్క సదాశివపేట మున్సిపాలిటీ లో జయా చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.17,18,4,8 వార్డులతో పాటు పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయారెడ్డి మాట్లాడుతూ  ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి అని, ఆయన  మాట ఇస్తే చేసి తీరుతారని అన్నారు. సదాశివపేట  లో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందికి తో పాటు ఇల్లు లేని ప్రతీ పేదలకు ఇంటి స్థలాలు జగ్గారెడ్డి ఇచ్చి తీరుతారాన్నరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆయా వార్డుల అభ్యర్థులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sunday, February 08, 2026

పులిమామిడి మమత గెలుపు కొరకు కష్టపడుతున్న రాజన్న మిత్రులు

 

 సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా  తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, February 07, 2026

అభివృద్ధి కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి. ..ఆశీర్వదించండి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు

 

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సంగారెడ్డి పట్టణ 30వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు మాట్లాడుతూ, “ఒక్క అవకాశం ఇవ్వండి… వార్డు అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నాదే” అని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంతోష్ నగర్, సాయి కృప నగర్, అయ్యప్ప కాలనీలలో రహిమత్ నగర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కోసం పనిచేసే కౌన్సిలర్‌గా నిలుస్తానని, పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన, పారదర్శకతతో 30వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనార్ధన్, తుల్జారాం, అజీజ్,సాయి కృప, అఖిల్, శ్రీధర్, తూర్పు ఆంజనేయులు, అరుణ్ చారి, కృష్ణ, ఆశిష్, వంశీ, సాయి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

పులిమామిడి మమత తరపున 12వ వార్డు నందు ప్రచారంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని పాతకేరి నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ గతకాలంలో కూడా పులిమామిడి రాజు 12 వ వార్డు ప్రజలకు ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 12 వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందజేసేలా చూశారాని వారి లాంటి మంచి మనసున్న వ్యక్తి మీకు దొరకడం 12 వ వార్డు ప్రజల అదృష్టమని నిర్మల జగ్గారెడ్డి గారు అన్నారు. ఈ సారి బి.సి మహిళ వచ్చిన సందర్భంగా వారి సతీమణి పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారని, మళ్ళీ వారిని గెలిపించుకుంటే 12 వ వార్డును మరింత అభివృద్ధి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం మన రేవంతన్న ప్రభుత్వం అందుబాటులో ఉందని ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి అధికార పార్టీకి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమత చేతి గుర్తుకు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 12 వ వార్డులో ఇంతవరకే కారును ప్రజలందరూ కలిసి ఫంచర్ చేశారని, ఈ ఎన్నికల తరువాత పూర్తిగా గ్యారేజికి పర్మనెంట్ గా పంపించగలరని 12 వ వార్డు ప్రజలకు తెలియ పరిచారు. ఇట్టి కార్యక్రమంలో సీడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న,పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ,  మండల అధ్యక్షులు చాట్ల సిద్దన్న, 12 వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

కమలం గుర్తే శ్రీరామ రక్ష: మెదక్ ఎంపీ రఘునందన్ రావు -12వ వార్డులో కార్నర్ మీటింగ్‌లో వ్యాఖ్యలు

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS):సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి భవిష్యత్తుపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాను రాను హిందువుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సంగారెడ్డి నాల్ సాబ్ గడ్డగా మారే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయం, భద్రత, అభివృద్ధికి కమలం గుర్తే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. భావితరాల భద్రత, సంస్కృతి పరిరక్షణ కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులు సాహితీ–రామును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమై బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

12 వార్డు అభివృద్ధికి 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు -12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి గులాంగరి ప్రవీణ్

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ 12 అవార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాంగరి ప్రవీణ్ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం అనంతరం 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు తేవడానికి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని తప్పకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అత్యధిక మెజారిటీతో మున్సిపాలిటీకి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 12 వ వార్డు అభివృద్ధికి ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించి వార్డులను సమగ్ర అభివృద్ధికి నిధులను కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ప్రత్యేక నిధులతో వార్డుల సమగ్ర అభివృద్ధి అదే విధంగా వార్డు రూపురేఖలు మారిపోతాయని తెలియజేశారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క సంగారెడ్డి మున్సిపల్ ఓటర్  12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Friday, February 06, 2026

12 వ వార్డులో గెలుపు ఖాయమన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12వ వార్డు నందు ఉదయం 10:00 నుండి తమ వార్డు ప్రజలందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత రాజు ఇంటింటా తిరుగుతూ గత కాలంలో తాము చేసినటువంటి సేవల గురించి ప్రజలకు తెలియపరుస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. రానున్న రోజులలో 12వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తమ ఓటరరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. అపోజిషన్ వారు గత 20 సంవత్సరాల నుండి పదవిలో ఉన్నా కూడా  వార్డు ప్రజలను పట్టించు కోలేరని ఇప్పటికే ప్రజలు వారిపై విసుగుచెంది మా వెంటే ఉన్నారని తెలియపరిచారు. పులి మామిడి మమత మాట్లాడుతూ మీకందరికి తెలుసు మేము మన వార్డులో ఇప్పటికే ఎన్ని పనులు చేశామో గమనించండి. అప్పుడు మేము అధికారంలో లేనప్పటికి మేము ఎన్నో పనులను చేశామని, ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని, అందుకోసమే నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా నాయకులు తూర్పు నిర్మల జగ్గారెడ్డి గార్ల సహాయ సహకారాలతో మన వార్డును మరింత అభివృద్ధి చేస్తానని పులి మామిడి మమత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, కంది కృష్ణ, 12వ వార్డు ఇంచార్జ్ వడ్ల బింబధర్ చారీ, మైనారిటీ సోదరులు ఎగ్బాల్, చోటు, సత్తార్, ఫయాజ్, జబ్బార్, ఇసుబ్, ఖర్చర్ల హరీష్, నరేష్, రాగం అనిల్, చిన్న, గుణాకర్, ఆంజనేయులు, రాము, ఇహకీల్ ఫహీం, మాణిక్యం, పరమదాసు, అఖిల్, మనోజ్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Thursday, February 05, 2026

12వార్డులో బీజేపీ ప్రచారానికి జోష్, సాహితీ రాము కు లభిస్తున్న ప్రజా ఆదరణ, గడపగడపకు బీజేపీ ప్రచారం


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితీకి వార్డు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. రాము సాహితీకి మద్దతుగా సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, 12వ వార్డులో గత కొన్నేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గతంలో వార్డు అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే సాధ్యమవుతున్నాయని తెలిపారు. 12వ వార్డు ప్రజలు రాము సాహితీని కౌన్సిలర్‌గా గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాము సాహితీకి తమ మద్దతు తెలిపారు.

12వ వార్డులో రాము సాహితికి బ్రహ్మరథం

                                                                                                                                                                     


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణం 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితికి వార్డు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి 12వ వార్డులో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి, రాము సాహితికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల పాలనలో 12వ వార్డులో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వార్డులో చేపట్టిన చాలా పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. రాము సాహితిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

12వ వార్డు అభివృద్ధే లక్ష్యం – గులాంగరి ప్రవీణ్

 

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 4 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాంగరి ప్రవీణ్ తెలిపారు. తాను ఎన్నికైతే అదనపు నిధులు సమకూర్చి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వరకు చేరేలా చర్యలు తీసుకుంటామని, వార్డు అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నప్పటికీ, ప్రజాసేవ పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నానని, తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత పాల్గొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తనకు మరింత ఉత్సాహాన్నిస్తోందని గులాంగరి ప్రవీణ్ తెలిపారు.

Wednesday, February 04, 2026

భూలక్ష్మి గోశాల సందర్శన గోరక్ష–గోసంవర్ధనకు పిలుపు

 

సైదాబాద్, ఫిబ్రవరి 3(SNM NEWS): 
ఆదర్శ గోశాలల సందర్శనలో భాగంగా సైదాబాద్‌లోని భూలక్ష్మి గోశాలను అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ నాయకులు, గోభక్తులు సందర్శించి గోమాతలకు విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత గోరక్ష విభాగం కన్వీనర్ శ్రీ దినేష్ చంద్ర ఉపాధ్యాయ్ జీ, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సహకార్యదర్శి శ్రీ ఆకారపు కేశవరాజు జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంతరించిపోతున్న గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. గోరక్షణ, గోసంవర్ధన, గోపోషణ, గోసమృద్ధి లక్ష్యంగా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘ్ చాలక్ శ్రీ సుందర్ రెడ్డి, గోరక్ష క్షేత్ర ప్రముఖులు యాదగిరిరావు, తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖుడు సుభాష్ చంద్ర, గోరక్ష తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి ఎన్. శ్యామ్ పాల్గొన్నారు. భూలక్ష్మి గోశాల అధ్యక్షులు శ్రీ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవింద్, కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సాయంత్రం 8 గంటలకు బాలకృష్ణ గురుస్వామితో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి వచ్చిన రిధి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. గోమాత ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సభ్యులు లోకేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, రాఘవేందర్, మాణిక్ యాదవ్, శ్యామ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి మామిడి మమత రాజు


సదాశివపేట, ఫిబ్రవరి 3(SNM NEWS): 

సదాశివపేట పట్టణంలోని 12 వవార్డులో భారీ జనసంద్రోహంతో గడప గడప తిరుగుతూ ప్రతి ఓటరును ఆకర్షిస్తూ కరపత్రాన్ని పంచుతూ 12 వ వార్డు అభ్యర్థి పులిమామిడి మమత రాజు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ అందించగలరని ఓటరు మహాషయులను విజ్ఞప్తిచేశారు. ఇట్టి సందర్భంగా పులి మామిడి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందజేస్తుందని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెనకానే ఉన్నారని, బిఆర్ ఎస్ పార్టీ కనుమరుగై పోతుందని అన్నారు. సంగారెడ్డి మరియు సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసు కోబోతుందని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఇట్టి కార్యక్రమంలో 12 వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొన్నారు. అదేవిధంగా 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారీ, బక్కప్ప, ఫయాజ్, మొయిజ్, రియాజ్, షకీల్, సురేష్, పి. ఎం. ఆర్ యువసేన నాయకులు మాణిక్యం, పరమదాసు, సంగమేష్, అనిల్, అఖిల్, అంజి, రాము, సోమ శంకర్,ఖరీం, అభిమానులు, మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

పార్టీ మోసం చేసింది… కన్నీరు పెట్టుకున్న 2వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి భాష

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి భాష పార్టీ తనను మోసం చేసిందని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ నుంచి అన్యాయం జరిగిందని పేర్కొంటూ, ప్రజలు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు. 2వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు కూడా అదే మాట చెప్పారని, అయితే చివరికి మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తీవ్రంగా ఆవేదనకు గురయ్యానన్నారు. సంగారెడ్డిలో రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారాయో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ పార్టీ తనకు అన్యాయం చేసినప్పటికీ ప్రజలు మాత్రం అన్యాయం చేయరని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 2వ వార్డులో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు లేదనే కారణంతోనే తనకు బిఆర్ఎస్ పార్టీ బీ–ఫారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓటు వేసి ఆశీర్వదించాలని సాయి భాష కోరారు.

సంగారెడ్డి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ ప్రచారం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి రాజుగౌడ్ మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంగారెడ్డి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవాజ్ ఇంటింటి ప్రచారం


సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS):: సంగారెడ్డి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం అని, వార్డులో బస్తి దావఖాన, అంగన్వాడి పాఠశాల ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెట్టిందని, 6వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఎన్నికలలో వార్డు ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నవాజ్ తెలిపారు.

బీఆర్‌ఎస్‌కు షాక్ – బీజేపీలో భారీ చేరికలు


-12వ వార్డులో బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్

-50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరిక                                                                                                      సంగారెడ్డి, ఫెబ్రవరి 3 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్ సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సాహితీ రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయనకు ఘన విజయం సాధించేలా కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Sunday, February 01, 2026

కెసిఆర్‌పై సిట్ విచారణను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

 

సంగారెడ్డి, (ప్రత్యేక ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సిట్ విచారణ చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.గ్రామానికి చెందిన మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సూచన మేరకు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చింతల సాయన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం కెసిఆర్‌పై సిట్ విచారణ చేపట్టారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల ద్వారా అధికార పార్టీ అన్యాయాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు చింటూ, మురళి పాల్గొనగా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిగోల లింగమయ్య, గొడుగు వెంకటేశం, పులంగారి కామేశ్వర్, రమేష్, బాబా, హరి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు.

ఎనకపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

 

సదాశివపేట, ఫిబ్రవరి 1: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలోని ఎనకపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఎం. దుర్గాప్రసాద్, ఉపసర్పంచ్ ఎండి. ఖాదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పశు వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ గౌడ్ పాడి గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు, సాధారణ వైద్య సేవలు అందించారు. ఎదకు వచ్చిన పాడి గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్లు గ్రామానికి వచ్చి అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయితీ తీర్మానం చేసి గ్రామ కంఠంలో పశువులను అరికట్టేందుకు బోను (ట్రేవిస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేటి దూడలే రేపటి పాడి పశువులవుతాయని, వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవో వి. విజయ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ సి. అర్జునయ్య, గోపాలమిత్రులు టి. కృష్ణ, ఎం. యాదయ్య, ఎం. రమేష్ పాల్గొన్నారు. పాడి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శిబిరంలో భాగంగా రైతులకు పాలు పెరగడానికి అవసరమైన మినరల్ మిక్సర్‌ను ఉచితంగా పంపిణీ చేయగా, అవసరమైన మందులన్నీ కూడా ఉచితంగానే అందజేశారు.

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...