సంగారెడ్డి, డిసెంబర్ 29 (SNM NEWS): వికారాబాద్లో ఇటీవల నిర్వహించిన ఎస్జీజీఎఫ్ అండర్–17 బాయ్స్ ఫుట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న కేంద్రీయ విద్యాలయ ఎద్దు మైలారం పాఠశాల విద్యార్థి గడ్డమీది సాయి సిద్ధార్థ గౌడ్కు సంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ, పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ క్రీడపై మాట్లాడిన ఎస్జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభావంతమైన యువ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహకారం అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Showing posts with label sangareddy political news. Show all posts
Showing posts with label sangareddy political news. Show all posts
Tuesday, December 30, 2025
Subscribe to:
Posts (Atom)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...
