Showing posts with label dalitha journalist forum. Show all posts
Showing posts with label dalitha journalist forum. Show all posts

Sunday, March 15, 2026

ఇసోజిపేటలో సిసి రోడ్డు పనుల ప్రారంభం

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 15 (SNM న్యూస్):  పుల్కల్ మండలంలోని ఇసోజీపేట గ్రామంలో 20 లక్షల సిసి రోడ్డు ప్రారంభిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, గ్రామ సర్పంచి విజేందర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి గురించి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు, ఈ గ్రామానికి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని సర్పంచ్ విజేందర్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నాయకుని గోవర్ధన్ సత్తార్ పటేల్  గోపాల్ తాజా మాజీ ఎంపిటిసి నాయకుని రవికుమార్ గ్రామ ఉపసర్పంచి రవికుమార్  వార్డు సభ్యులు బి నరేంద్ర,నాయకులు శివనుల గణపతి తలారి యాదగిరి సుఖేందర్ రెడ్డి లచిరెడ్డి లక్మన్ రెడ్డి మంగలి రాజు పండరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Saturday, January 24, 2026

ఈనెల 25న చలో కోకాపేట్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజసంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం

 

 సంగారెడ్డి ,  జనవరి 23,  (SNM న్యూస్): కోకాపేట్  లో జరిగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజసంఘం రాష్ట్ర  కమిటీ ప్రమాణ స్వీకారానికి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ లు అందరూ తప్పకుండా హాజరు కాగలని  శుక్రవారం రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యన్.శివకుమార్ గారి అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ  ఆదివారం రోజు  ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ సంజీవని హనుమాన్ ఆలయం సంగారెడ్డి (భూమయ్య పెట్రోల్ బంక్ ) దగ్గర బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా నుండి వందలాదిమంది సంఘ నాయకులు, సంఘ సభ్యులు తరలి వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం,  క్యాలెండర్,  డైరీ ఆవిష్కరణ జరుగుతుందని అలాగే  నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ లకు సన్మానం కలదన్నారు . కాబట్టి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాలోని వీరశైవలింగాయత్ బంధు మిత్రులందరు హాజరు కాగలరని వారు కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్  జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలకంటి మాణయ్య  జిల్లా కోశాధికారి జె రాజేశ్వర్ స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ పి శివకుమార్ ముఖ్య సలహాదారులు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్  తుమ్మలపల్లి పృథ్వీరాజ్  డిసిప్లినరీ, ప్రెస్  కమిటీ అధ్యక్షులు  యమ్.అశోక్ బాబు  యూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, September 20, 2025

దళిత జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా -మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 20 (SNM NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నుండి వచ్చిన దళిత జర్నలిస్టులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సోదరుల హక్కులు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితుల సమస్యలపై ఇప్పటికే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు. బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయిస్తే దళితుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, దళితుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నేను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి భరోసా ఇచ్చారు. దళితుల అభ్యున్నతికి తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, నేను కూడా అదే మార్గంలో నడుస్తూ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దళితుల భూమి సమస్యపై అన్యాయం జరగకూడదని అప్పుడు కూడా తన కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దళితుల కోసం నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాగు జాన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రాపాక విజయరాజు, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...