Saturday, February 21, 2026

సంగారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి..సదా నేను అండగా ఉంటా


-తనను కలిసిన సంగారెడ్డి మున్సిపల్ నూతన పాలకవర్గంతో కలెక్టర్ పి.ప్రావీణ్య హామీ

-టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తో కలిసి  కలెక్టర్ ను కలిసిన సంగారెడ్డి నూతన పాలకవర్గ సభ్యులు

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 20 (SNM న్యూస్):..ఇటీవల నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఈరోజు శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఆమెను కలిసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఆమె అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల ఇచ్చిన మాట మేరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నామని వారు  కలెక్టర్ కు వివరించారు.  టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల సూచనల మేరకు సంగారెడ్డి మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వారు కలెక్టరుకు వివరించారు. మెరుగైన పారిశుద్ధం, ఇంటింటికి స్వచమైన తాగునీరు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు, ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని వాళ్ళు వివరించారు. సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గంలో యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారని, ఇది మున్సిపాలిటీకి చాలా ప్రయోజనం చేకూర్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని పాలకవర్గానికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షఫీ హఫిజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొంగుల రవి, కూన సంతోశ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, రవి నాయక్, గుర్రం ఝాన్సీ, మోతే శ్యామ్, వీణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...