Wednesday, February 04, 2026

సంగారెడ్డి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ ప్రచారం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి రాజుగౌడ్ మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...