Tuesday, March 31, 2026

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం


సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తన విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో 27వ నూతన స్టోర్ ‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. సంగారెడ్డిలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యజమాన్యాన్ని అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజు గౌడ్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, జాఫర్, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నక్క నాగరాజ్ గౌడ్, లాడేబాలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభ...