Showing posts with label BRS. Show all posts
Showing posts with label BRS. Show all posts

Tuesday, March 31, 2026

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం


సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తన విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో 27వ నూతన స్టోర్ ‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. సంగారెడ్డిలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యజమాన్యాన్ని అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజు గౌడ్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, జాఫర్, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నక్క నాగరాజ్ గౌడ్, లాడేబాలు తదితరులు పాల్గొన్నారు.

Sunday, February 01, 2026

కెసిఆర్‌పై సిట్ విచారణను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

 

సంగారెడ్డి, (ప్రత్యేక ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సిట్ విచారణ చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.గ్రామానికి చెందిన మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సూచన మేరకు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చింతల సాయన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం కెసిఆర్‌పై సిట్ విచారణ చేపట్టారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల ద్వారా అధికార పార్టీ అన్యాయాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు చింటూ, మురళి పాల్గొనగా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిగోల లింగమయ్య, గొడుగు వెంకటేశం, పులంగారి కామేశ్వర్, రమేష్, బాబా, హరి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు.

Sunday, January 25, 2026

ప్రతి ఫోటో–వీడియో గ్రాఫర్‌కు కుటుంబ భరోసా తప్పనిసరి

 


జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్

సంగారెడ్డి, జనవరి 25:—ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా కుటుంబ భరోసా స్కీమ్లో చేరాలని సంగారెడ్డి జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ అన్నారు.శనివారం సంగారెడ్డి పట్టణంలోని పద్మశాలి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు సభ్యులందరి నుంచి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ, సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు ఇవి:

కుటుంబ భరోసా స్కీమ్, TGPVWA యాప్ కార్యక్రమం

ఆధునిక ఏఐ సాంకేతికత – ప్రాముఖ్యత, వినియోగాలు

ఎల్‌ఈడీ వాల్, డ్రోన్, సినిమాటిక్ ఫోటోగ్రఫీ

సంఘ సభ్యత్వం – ప్రాధాన్యత

జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలు

ఫోటోగ్రాఫర్ల వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు

జిల్లా, మండల కార్యవర్గ లోపాలపై సమీక్ష

జిల్లా స్థాయిలో ఒకే ధరల జాబితా (ప్రైస్ లిస్ట్) అంశం

జిరాక్స్ కేంద్రాలు, ఇతర దుకాణాల్లో పాస్‌పోర్ట్ ఫోటోలు తీయడంపై చర్చ

స్థానిక సమస్యలు, సభ్యుల అభిప్రాయాల సేకరణ

ఫోటోగ్రాఫర్లకు వర్క్‌షాప్‌లు, అవగాహన సదస్సులు

ఈఎస్‌ఐ వంటి సంక్షేమ అంశాలు

కుటుంబ భరోసా స్కీమ్‌లో ఇంకా నమోదు చేసుకోని ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఈ పథకం ప్రాముఖ్యతను తెలియజేసి సభ్యత్వం కల్పించే బాధ్యత మండల స్థాయి పీఎస్‌టీ లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.జి ల్లా కార్యవర్గ సభ్యులందరూ అంకితభావంతో పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి బాలరాజ్, తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Thursday, December 18, 2025

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Wednesday, December 17, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన నూతన సర్పంచ్ లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ - సతీష్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చంతో సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి విజేందర్ రెడ్డి ఆర్.వెంకటేశ్వర్లు, పీ.నర్సింలు ,మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, సందీప్, జలంధర్ , పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...