సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ 12 అవార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాంగరి ప్రవీణ్ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం అనంతరం 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు తేవడానికి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని తప్పకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అత్యధిక మెజారిటీతో మున్సిపాలిటీకి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 12 వ వార్డు అభివృద్ధికి ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించి వార్డులను సమగ్ర అభివృద్ధికి నిధులను కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ప్రత్యేక నిధులతో వార్డుల సమగ్ర అభివృద్ధి అదే విధంగా వార్డు రూపురేఖలు మారిపోతాయని తెలియజేశారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క సంగారెడ్డి మున్సిపల్ ఓటర్ 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, February 07, 2026
12 వార్డు అభివృద్ధికి 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు -12 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి గులాంగరి ప్రవీణ్
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment