Showing posts with label SNM HEALTH. Show all posts
Showing posts with label SNM HEALTH. Show all posts

Friday, December 19, 2025

మధుమేహ వ్యాధిగ్రస్తులు కుంకుమ పువ్వు

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు ఏదంటే టక్కున గుర్తొచ్చేది కుంకుమపువ్వు. ఈ పువ్వు ఉత్పత్తికి సాగు చేసే విధానం కారణంగా, కుంకుమపువ్వు ధర అత్యధికంగా ఉంటుంది. నిజానికి.. ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. అవేంటో తెలుసుకుందాం.. కొన్నిసార్లు కోపం రావడం, కొన్నిసార్లు ఏడవడం.. ఇలాంటి మానసిక కల్లోలం తరచుగా రావడం అస్సలు మంచిది కాదు. ఈ పరిస్థితిలో కుంకుమపువ్వు సహాయం తీసుకోవచ్చు. కుంకుమపువ్వు మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుందని, డిప్రెషన్‌ లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కుంకుమపువ్వును తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కుంకుమపువ్వు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రీ-మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ సమస్యకు కుంకుమపువ్వు మేలు చేస్తుంది. అంటే రుతుక్రమం రాకముందే కలిగే మానసిక, శారీరక ఆనారోగ్యాన్ని కుంకుమపువ్వు దూరం చేస్తుంది. కాలు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. రోజూ కుంకుమపువ్వు కలిపిన టీ లేదా పాలు తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. కుంకుమపువ్వు ఆకలిని అణిచివేసి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మసాలాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊబకాయాన్ని నివారిస్తాయి. జీవక్రియ రుగ్మతలను తొలగిస్తాయి. కుంకుమపువ్వు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

అడపాదడపా ఉపవాసం చేస్తున్నారా.?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): ఇంటర్మీటెంట్‌ ఫాస్టింగ్‌(అడపాదడపా ఉపవాసం) వల్ల గుండె జబ్బులు వస్తాయని, స్ట్రోక్‌ వస్తుందని గత నాలుగైదు రోజులుగా ఎన్నో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. లాలాజలంలో టయలిన్‌ అనే ఎన్‌జైమ్‌ ఉంటుంది. మన జీర్ణాశయంలో 4 గంటల పాటు ఉండి అక్కడ జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌.. కాలేయం నుంచి వచ్చే కాలేయ రసాలు బైల్‌ యాసిడ్స్‌, క్లోమం నుంచి వచ్చే ఎన్‌జైమ్‌లు అన్ని కూడా ఈ ఆహారంతో కలుస్తాయి. ఈ ప్రాసెస్‌ అంతా జరగడానికి జీర్ణాశయం నుంచి మన ఆహారం బయటకు వెళ్లడానికి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయం నుంచి ఆహారం కిందకు వెళ్తేనే మరలా మనకు ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. అసలైన జీర్ణ వ్యవస్థ.. అసలైన ఆహారం జీర్ణం కావడం 6 గంటల తర్వాతే ప్రారంభమవుతుంది. దీనిని ఇంటర్‌ డైజెస్టివ్‌ ఫేస్‌ అని అంటారు. ఈ ఆహారం జీర్ణకోశం నుంచి కిందకు వెళ్లిన తర్వాత దాదాపు 3 మీటర్ల పొడుగున ఉండే చిన్న ప్రేగుల ద్వారా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ఆహారంలో ఉన్న పదార్థాల్ని గ్లూకోజ్‌ గానూ ప్రోటీన్‌ లాగానే విభజించి వాటిని చిన్న ప్రేగులలో ఉన్న విల్లై ద్వారా అబ్సార్బ్‌ చేసుకొని అవి మరలా బ్లడ్‌లో కలిసి లివర్‌కు వెళ్లి కొంత స్టోర్‌ అయ్యి మనకు శక్తిని ప్రసాదిస్తాయి. తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్లి వీలైనంత నీటిని పీల్చుకొని విసర్జన జరుగుతుంది. ఇలా జీర్ణం కావడానికి మొత్తం 24 గంటల సమయం పడుతుంది. మన శరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ఇంటర్‌ డైజెస్టివ్‌ ఫేస్‌ అనే 16 గంటల సమయమే.. మనం చాలామంది జీర్ణకోశంలో ఆహారం ఉంటేనే మనకి శక్తి వస్తుంది అని అనుకుంటాం అది తప్పు. మరి ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తే హార్ట్‌ స్ట్రోక్స్‌ వస్తాయంటూ వైరల్‌గా మారింది. దీన్ని వైద్యులు కొట్టిపారేశారు. చైనాలో ఓ 200 మందికి ఫోన్‌ చేసి ప్రశ్నలడిగి, అవే ప్రశ్నలు అమెరికాలో ఉండే 200 మందికి అడిగి ఇక గుండె జబ్బులు వస్తాయి అంటున్నారని.. కానీ వాస్తవానికి దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు జతపరచలేదని.. ఇది ఒక బేసిక్‌ స్టడీ మాత్రమే కానీ దీనికి ఎటువంటి ప్రామాణికత లేదంటున్నారు. బాగా గమనించినట్లయితే చాలా జంతువులు, పక్షులు అన్నీ కూడా ఒక పూటనే తింటాయని.. మనుషుల మాదిరి చాలాసార్లు తినవంటున్నారు. తక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం గ్యాప్‌ ఇవ్వడం వల్ల పేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యి ఇంకా బాగా శరీరంలోకి అబ్సార్బ్‌ అవుతుంది అంటున్నారు. అందుకే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అనేది నిజంగా ఫాస్టింగ్‌ కాదని మామూలుగా చేయాల్సిన పనే అంటున్నారు. అది కాకపోతే మనం ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నాం. శరీర నిర్మాణంలో జీర్ణాశయం అనేది ఒక స్టోరేజ్‌ పాయింట్‌. పాత కాలంలో ఆహారం సదా దొరకదు. కాబట్టి మనకు జీర్ణాశయం అనేది పరిణామ క్రమంలో డెవలప్‌ అయింది. అనగా మనం ఆహారాన్ని ఒకేసారి తీసుకొని దానిని నిదానంగా కిందికి పంపిస్తూ జీర్ణం జరగడానికి అలవాటు పడిపోయాం.  


బార్లీ వాటర్‌ తాగడం నేర్చుకోండి

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): రోజూ బార్లీ వాటర్‌ తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బార్లీలో నీటిలో కరిగే, కరగని ఫైబర్‌, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బార్లీ నీరు మూత్రనాళం, మూత్రాశయం వంటి ప్రాంతాలలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లోని మూత్రవిసర్జన లక్షణాలు దీనికి సహాయపడతాయి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ విషయంలో ఇన్ఫెక్షన్‌ తగ్గించేందుకు రోజూ బార్లీ వాటర్‌ తాగండి. బార్లీ నీటిలో అధిక మొత్తంలో ఫైబర్‌ ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. బార్లీలో ఉండే ఫైబర్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే పీచు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచే అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. బార్లీలో ముఖ్యంగా బీటా-గ్లూకాన్‌ అని పిలిచే ఒక రకమైన కరిగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అనేక వ్యాధులను దూరం చేస్తాయి. బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులలో స్థిరమైన గ్లూకోజ్‌ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీరు సహాయపడుతుంది. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. ఇది కిడ్నీలో రాళ్లు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

నిద్రలేమికి చెక్‌ పెట్టే ఆహారాలు?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):నిద్రలేమి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి, అధిక రక్తపోటు, బలహీనమైన జ్ఞాపకశక్తి ఇంకా అలాగే దృష్టి లేకపోవడం వంటి సమస్యలకు ఖచ్చితంగా దారి తీస్తుంది.సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, అలసట ఇంకా అలాగే మానసిక కల్లోలం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం నిద్రలేమి సమస్యకి చాలా ఈజీగా చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాపిల్స్‌లో ఫైబర్‌, నేచురల్‌ షుగర్స్‌ ఉంటాయి, ఇవి మన శరీరంలో బ్లడ్‌ షుగర్‌ని మెయింటెయిన్‌ చేయడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.బొప్పాయిలో విటమిన్‌ సి, ఇ, ఫోలేట్‌ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పొటాషియం కండరాలను రిలాక్స్‌ చేస్తుంది. ఇందులో పాపైన్‌ అనే ఎంజైమ్‌ కూడా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది. నారింజ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు పెట్టింది పేరు. అలాగే ఇందులోని విటమిన్‌ సి నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతంది.అలాగే విటమిన్‌ సి పుష్కలంగా ఉండే కివిలో సెరోటోనిన్‌ ఇంకా పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.అలాగే చెర్రీలు కూడా నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలోని మెలటోనిన్‌ అనే హార్మోన్‌, నిద్ర చక్రాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మంచి నిద్రకు ఈ హార్మోన్‌ చాలా అవసరం. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.అరటిపండ్లు విటమిన్‌ బి6, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉండటం వల్ల నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తుంది.  

థైరాయిడ్‌ తగ్గాలంటే ఇవి తినాల్సిందే?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):ఈ రోజుల్లో చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తున్న సమస్య థైరాయిడ్‌.ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది.ఇది తీవ్రమైన జీవనశైలి వ్యాధి, ఇది చాలా కాలంగా సరైన ఆహారం ఇంకా నిశ్చల జీవనశైలిని అనుసరించడం వల్ల మహిళల్లో ఎక్కువగా వస్తుంది.పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైన, చాలా ప్రయోజనకరమైన పానీయం. అందుకే ఖచ్చితంగా ప్రతిరోజూ కూడా పసుపు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పానీయం థైరాయిడ్‌ గ్రంథి వాపును ఎంతో తగ్గిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.చమోమిలే టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ, ఫెన్నెల్‌, జీలకర్ర, ఆకుకూరల వంటి కొన్ని హెర్బల్‌ టీలు తాగడం థైరాయిడ్‌ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా, ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే ఆకుకూరల రసంలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోయి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అదనంగా, అవి థైరాయిడ్‌ పనితీరును మెరుగుపరచడంలో లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ, బి, సి, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌తో పాటు లైకోపీన్‌, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల థైరాయిడ్‌ గ్రంధికి అవసరమైన పోషణ అందుతుంది. దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఎన్నో ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న మజ్జిగ ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ప్రోబయోటిక్‌ గా ఉపయోగపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. థైరాయిడ్‌ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.

మైగ్రేన్‌ తగ్గిపోవాలంటే..?


హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): మైగ్రేన్‌ తగ్గిపోవాలంటే క్రమంగా కెఫిన్‌ తీసుకోవడం ఖచ్చితంగా తగ్గించాలి.ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్‌ గా ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్‌ బ్యాలెన్స్‌ను మైంటైన్‌ చేస్తూ ఉండాలి.ఇంకా అలాగే యోగా వంటి వ్యాయామాలు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సమయానికి నిద్రపోవాలి.అధిక ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చుతాయి. ఇది కాలుష్యం, అలెర్జీ కారకాలకు దారితీస్తుంది. కొంతమందికి ఈ వాతావరణ మార్పు సైనస్‌ తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్‌ పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మైగ్రేన్‌ రిస్క్‌ తగ్గాలంటే కొన్ని ఆహారాలు, పానీయాలు మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కార్బోనేటేడ్‌ డ్రిరక్స్‌, ఎనర్జీ డ్రిరక్స్‌ ఇంకా కాఫీ మైగ్రేన్‌లను తీవ్రతరం చేస్తాయి. కొంతమందికి వేసవిలో మైగ్రేన్‌లు ఎక్కువ అవుతాయి. ఇది ప్రధానంగా అధిక ఉష్ణోగ్రత, తేమ, పగటిపూట సూర్యరశ్మికి గురికావడం వంటి కారణాల వల్ల జరుగుతుంది. కెఫీన్‌ కొందరిలో మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తుంది. కెఫిన్‌ కలిగిన పానీయాల వినియోగం వల్ల మైగ్రేన్‌లు, తేలికపాటి నిర్జలీకరణంపై ప్రత్యక్ష ప్రభావం వల్ల తలనొప్పి రావచ్చు. సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ లేదా పెస్టిసైడ్స్‌లోని కొన్ని రసాయనాలు వాటి బలమైన సువాసనల కారణంగా మైగ్రేన్‌ బాధితులలో తలనొప్పిని ప్రేరేపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో తలనొప్పులు రావడానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు పెరగడమే అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్‌ మైగ్రేన్‌లకు కారణమవుతుంది. విపరీతమైన వేడి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. మీరు ఉపశమనం కోసం మాత్రను తీసుకునే ముందు మీ శరీరం బాగా హైడ్రేట్‌ అయ్యిందని నిర్ధారించుకోండి. అప్పుడు నీరు పుష్కలంగా తాగాలి. ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోకుండా ఉండటానికి నిమ్మకాయ నీటిలో ఉప్పు కలుపుకుని తాగితే మంచిది.మైగ్రేన్‌ సమస్య చాలా మందిని కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలంలో మైగ్రేన్‌ బాధితుల సంఖ్య పెరుగుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. వేసవి కాలంలో మైగ్రేన్లు మరింత తీవ్రమవుతాయి కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి.


బేబీ కార్న్‌ ఉపయోగాలు...

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):సాధారణంగా మనం స్వీట్‌ కార్న్‌, మొక్కజొన్నలు వంటివి చూస్తూనే ఉన్నాము. అయితే బేబీ కార్న్‌ అనేది కూడా చాలా రుచికరమైనవే.. ఇవి పూర్తిగా ఆకులతో చుట్టబడినట్టుగా ఉంటాయి. పురుగుమందుల ప్రభావం కూడా పెద్దగా ఉండదు.. బేబీ కార్న్‌ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్‌, క్యాల్షియం, విటమిన్‌ ,ఐరన్‌ వంటివి చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి కొవ్వు లేకుండా ఫైబర్‌ కంటెంట్‌ మాత్రమే పుష్కలంగా లభిస్తుంది. ఇందులో కూడా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. బేబీ కార్న్‌ అనేది యాంటీ ఆక్సిడెంట్‌ పవర్‌ హౌస్గా పిలుస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థను సైతం వెంటనే అందించడానికి సహాయపడతాయి. బేబీ కార్న్‌ మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి అవసరమైన సమయాలలో విటమిన్స్‌ ఖనిజాలు కూడా అందిస్తాయి. బేబీ కార్లలో డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులకు తినడం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా పెరగకుండా చేస్తుంది. జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు.. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. బేబీ కార్న్ల ఎక్కువగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండడం వల్ల జీర్ణక్రియలో సహాయపడతాయి. సాధారణ ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహించడానికి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ బేబీ కార్న్‌ చాలా మంచిది. బేబీ కార్న తినడం వల్ల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఇందులో విటమిన్‌-%ష% పుష్కలంక లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ కణాలను సైతం పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.. చర్మం మృదువుగా కనిపించిన కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే వీటిని తినాల్సిందే. ఇందులో ఉండేటువంటి ఫైబర్‌ కొలెస్ట్రాలను సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుందట. బేబీ కార్న్‌ లో కెరోటి నాయుడులు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. బేబీ కార్న్‌ లో పొటాషియం మరియు ఫైబర్‌ కలయిక ఉండటం వల్ల రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...