Thursday, February 05, 2026

12వార్డులో బీజేపీ ప్రచారానికి జోష్, సాహితీ రాము కు లభిస్తున్న ప్రజా ఆదరణ, గడపగడపకు బీజేపీ ప్రచారం


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితీకి వార్డు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. రాము సాహితీకి మద్దతుగా సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, 12వ వార్డులో గత కొన్నేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గతంలో వార్డు అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే సాధ్యమవుతున్నాయని తెలిపారు. 12వ వార్డు ప్రజలు రాము సాహితీని కౌన్సిలర్‌గా గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాము సాహితీకి తమ మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...