Thursday, June 11, 2026

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

 

సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామా భాస్కర్ గుప్తా, జిల్లా పరిశ్రమల శాఖ సూపరిండెంట్ ఇరుకుల ప్రదీప్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Monday, June 08, 2026

వినూత్న విద్యా విధానాలతో ముందుకు వస్తున్న కృపానిధి కృష్ణవేణి హై స్కూల్

 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం – స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

సంగారెడ్డి, జూన్ 3: నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో కృపానిధి కృష్ణవేణి హై స్కూల్ వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఎల్టీఎస్ ఇంగ్లీష్, ఫోనిక్స్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, వ్యాకరణ ఖచ్చితత్వ శిక్షణ, భావనాత్మక పదజాల అభివృద్ధి వంటి ప్రత్యేక బోధనా విధానాలను అమలు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. అదనంగా డిజిటల్ తరగతి గదులు, రోబోటిక్స్, సైన్స్ ప్రయోగశాలలు, స్కేటింగ్, వినోదాత్మక విద్యా కార్యక్రమాలు, ఆధునిక బోధనా సాంకేతికతలతో సమగ్ర విద్యను అందిస్తున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే ఉద్దేశంతో జూన్ 10న స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్–2026 నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.15,000, రూ.10,000, రూ.5,000 నగదు బహుమతులను అందజేయడంతో పాటు పాల్గొనే వారందరికీ ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు పేర్కొంది. టాలెంట్ టెస్ట్ సందర్భంగా విద్యార్థుల కోసం బోటింగ్, బబుల్ హౌస్, అమ్యూజ్‌మెంట్ గేమ్స్ తదితర వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమర్థమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల పనిచేస్తోందని యాజమాన్యం పేర్కొంది. ప్రవేశాలు మరియు స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 94908 67070 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.

Saturday, June 06, 2026

సంగారెడ్డి లో మరో 210 మంది చిన్నారులకు సైకిళ్ళు అందజేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి జూన్ 6: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యం లో  చిన్నారులకు  విడతలవారీగా   సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 400 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేసిన జగ్గారెడ్డి శనివారం మరో 210 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేశారు.  చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి  పెంచడమే లక్ష్యంగా  జగ్గారెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.  స్థానిక పిఎస్సార్  గార్డెన్ లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతీ ఒక్క చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందజేశారు. ఐదు సంవత్సరాలు మొదలుకుని 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు సైకిళ్ళు అందజేశారు.

చిన్నారులకు,బాలురకు, బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్ళు అందజేశారు. గత వారం టోకెన్ లు ఇచ్చిన వారికి శనివారం సైకిళ్ళు పంపిణీ చేశారు. టోకెన్ లు లేని చిన్నారుల కు మరోసారి సైకిల్ లు పంపిణీ చేసేందుకు వీలుగా అందరి చిన్నారుల  ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తో కూడిన వివరాలు తీసుకోవాలని జగ్గారెడ్డి నిర్వాహకులకు సూచించారు. సైకిళ్ళు రాని చిన్నారులు ఎవరు ఆందోళన పడవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్ళు పంపిణీ చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్ , సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Friday, June 05, 2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన చెట్ల నరికివేతపై బీఆర్ఎస్ ఆగ్రహం

 


భూత్కూర్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మొక్కల నాటకాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్న వేళ, భూత్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఇప్పటికే నాటిన మొక్కలను కారణం లేకుండా నరికివేయడం బాధాకరమని గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి తలారి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచాల్సిన సమయంలో వాటిని నరికివేయడం సమంజసం కాదన్నారు. పర్యావరణంపై కనీస అవగాహన లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది, పాలకవర్గం వ్యవహరించడం విచారకరమని విమర్శించారు. చెట్లను నరికివేయడమే అభివృద్ధి కాదని, గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా గ్రామపంచాయతీ పాలకవర్గం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే గ్రామ ప్రజలతో కలిసి తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.

అత్యాధునిక సదుపాయాలతో రాయల్ కార్ వాష్ సెంటర్ ప్రారంభం

 

సంగారెడ్డి, జూన్ 4: సంగారెడ్డి పట్టణంలోని మల్కాపూర్–రాజంపేట రహదారి మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ సెంటర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్ వాష్ సెంటర్ యాజమాన్యం మాట్లాడుతూ అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక సదుపాయాలతో అన్ని రకాల కార్లకు నాణ్యమైన వాషింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సోహెబ్, ఎం.డి. అబ్బాస్, సయ్యద్ షాహిద్ పాషా, ఎం.డి. విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన డీఈఓ రోహిణిని మర్యాదపూర్వకంగా కలిసిన అఖిల్, బత్తుల విక్రమ్


సంగారెడ్డి, జూన్ 5: సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈఓ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి రోహిణిని అఖిల్, బత్తుల విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, జిల్లా విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం డీఈఓ రోహిణి మాట్లాడుతూ, జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని వెల్లడించారు. ఈ భేటీలో జిల్లా విద్యా రంగ అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల తదితర అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

పరిసరాల పరిశుభ్రత పై శ్రద్ద వహించాలి

 

రాయికోడ్ జూన్ 4: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్ అన్నారు. గురువారం రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామం లో సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ ఆధ్వర్యంలో  ప్రజాపాలన పల్లెప్రగతి గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి ఎంపిడిఓ హాజరై మాట్లాడుతూ  గ్రామాభివృద్ధి, వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత త్రాగునీటి వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ అవసరం, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవ కార్యక్రమాల ప్రాధాన్యంపై అధికారులు వివరించారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, వరదల సమయంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై గ్రామస్థులకు సూచనలు చేశారు. 

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని  కోరారు. గ్రామస్థులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు, సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో సర్పంచ్ మహబూబ్ పటేల్ తో కలిసి పర్యటించి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి ఫిల్టర్ ను పరిశీలించి సర్పంచ్ ను అభినందించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బస్వరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వార్డ్ మెంబర్ లు, పలువురు గ్రామ స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...