2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం – స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

సంగారెడ్డి, జూన్ 3: నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో కృపానిధి కృష్ణవేణి హై స్కూల్ వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఎల్టీఎస్ ఇంగ్లీష్, ఫోనిక్స్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, వ్యాకరణ ఖచ్చితత్వ శిక్షణ, భావనాత్మక పదజాల అభివృద్ధి వంటి ప్రత్యేక బోధనా విధానాలను అమలు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. అదనంగా డిజిటల్ తరగతి గదులు, రోబోటిక్స్, సైన్స్ ప్రయోగశాలలు, స్కేటింగ్, వినోదాత్మక విద్యా కార్యక్రమాలు, ఆధునిక బోధనా సాంకేతికతలతో సమగ్ర విద్యను అందిస్తున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే ఉద్దేశంతో జూన్ 10న స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2026 నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.15,000, రూ.10,000, రూ.5,000 నగదు బహుమతులను అందజేయడంతో పాటు పాల్గొనే వారందరికీ ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు పేర్కొంది. టాలెంట్ టెస్ట్ సందర్భంగా విద్యార్థుల కోసం బోటింగ్, బబుల్ హౌస్, అమ్యూజ్మెంట్ గేమ్స్ తదితర వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమర్థమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల పనిచేస్తోందని యాజమాన్యం పేర్కొంది. ప్రవేశాలు మరియు స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 94908 67070 నంబర్ను సంప్రదించాలని సూచించింది.