-12వ వార్డులో బీఆర్ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్
-50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరిక సంగారెడ్డి, ఫెబ్రవరి 3 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్ సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సాహితీ రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయనకు ఘన విజయం సాధించేలా కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

No comments:
Post a Comment