సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపతి సంతోష్ స్వామి ,సమాజం నాయకులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. స్వామి పై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి శిక్ష వేయించాలి అధ్యక్షుడు సంతోష్ కుమార్ స్వామి డిమాండ్ చేశారు.
దాడిలో గాయపడిన ఆయనకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరుపున జిల్లా ఎస్పీ కార్యాలయము ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి,బసవలింగం స్వామి,శిశిధర్ స్వామి ,శివప్రసాద్ స్వామి,మఠం శివకుమార్ స్వామి,నగేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment