సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): హైదరాబాద్లోని ఆయన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి. హరీష్ రావుని బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రజలు మళ్లీ అభివృద్ధి పాలన కోరుకుంటున్నారని హరీష్ రావు గారు విశ్వాసం వ్యక్తం చేసినట్లు అఖిల్ తెలిపారు. యువత పార్టీకి అండగా నిలవాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.

No comments:
Post a Comment