సంగారెడ్డి, (ప్రత్యేక ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సిట్ విచారణ చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.గ్రామానికి చెందిన మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సూచన మేరకు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చింతల సాయన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం కెసిఆర్పై సిట్ విచారణ చేపట్టారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల ద్వారా అధికార పార్టీ అన్యాయాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు చింటూ, మురళి పాల్గొనగా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిగోల లింగమయ్య, గొడుగు వెంకటేశం, పులంగారి కామేశ్వర్, రమేష్, బాబా, హరి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment