Showing posts with label sanagareddypolice. Show all posts
Showing posts with label sanagareddypolice. Show all posts

Monday, February 09, 2026

నాయి కోటి అశ్విని నవీన్ కుమార్ లభిస్తున్న ప్రజా ఆదరణ -గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం

 


సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 32వ వార్డు అభ్యర్థి నాయి కోటి అశ్విని సవీన్ కుమార్ ఇంటింటికి తిరిగి కార్యకర్తలతో ప్రచారం చేశారు. మున్సివల్ 32 వ వార్డు అభ్యర్థి నాయికోటి అశ్వని కుమార్ మాట్లాడుతూ గత కాలంలో మేము చేసిన అభివృద్ధి మీ అందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా వ్రతి ఇంటికి తిరిగి శానిటైజషన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రతి! ఇంటికి రోజు మంచినీటి సరఫరా మరియు సొంత నిధులతో టాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వీధికి సిసి రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వార్డు రేఖలను మార్చాము. వార్డు ప్రజల సౌలభ్యం కోసం కలెక్టర్ వెనకాల పార్కును ఏర్పాటు చేశాము. వాటర్ ట్యాంక్ నిర్మించామని, డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా బిల్డింగ్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం పెంచామని అన్నారు. గతంలో చేసిన విధంగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నామని తెలియజేశారు. పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా ఉంటాను. అందరూ గర్వపడేలా పనిచేస్తాను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాలనీవాసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

Thursday, December 18, 2025

డిసెంబర్ 21న జరుగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి..

సంగారెడ్డి ప్రతినిధి (SNM NEWS): ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను ఊదేశించి జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడవచ్చు అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుంది అన్నారు. ఈ నెల 21 ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించడం జరిగింది.  ఎస్.హెచ్.ఓ లు, కోర్ట్ డ్యూటి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు,  వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం అన్ని కేసులలో ఇరువర్గాల సమ్మతితో రాజీపడేలా చూడాలని అన్నారు.  సైబర్ నేరాలకు సంభందించి, సైబర్ మోసగాళ్ల చేతిలో  బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా భాదితులకు అందే విధంగా చూడాలని, 25 వేల రూపాయల కంటే తక్కువ డబ్బు కోల్పోయిన కేసులలో లోక్-అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకొని, ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియా చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.  ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు భాద్యత యుతంగా వ్యవహరించి, రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు.

Thursday, November 20, 2025

చిన్నారికి డ్రగ్-రిఫ్రాక్టరీ ఎపిలెప్సీకి ఇమేజ్- గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమీని విజయవంతంగా నిర్వహించిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్

 

సంగారెడ్డి, 19 నవంబర్ (SNM న్యూస్): హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ లెఫ్ట్ ప్యారిటల్ ఫోకల్ కార్టికల్ డిపార్డైసియా వల్ల కలిగిన డ్రగ్-రిఫ్రాక్టరీ ఫోకల్ ఎపిలెప్పీతో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడు. కపిల్ రెడ్డి దర్మారెడ్డికి విజయవంతంగా చికిత్స అందించింది. మూడు యాంటీ-ఎపిలెప్టిక్ మందులు వాడుతున్నప్పటికీ, ఆ బాలుడు తల, కళ్ళలో టానిక్ డీవియేషన్ లక్షణాలను అనుభవిస్తున్నాడు, దానితో పాటు కొంత సమయం స్పృహ కోల్పోతున్నాడు. మల్టీమోడల్ ఇమేజింగ్ న్యూరోలాజికల్ పరీక్షల తర్వాత, వైద్య బృందం శస్త్రచికిత్సను సిఫార్సు చేసింది. 21 ఫిబ్రవరి 2025న, పేషేంట్ కు ఎలక్ట్రోకార్టికోగ్రామ్ తో లెఫ్ట్ ఇమేజ్-గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమ్ నిర్వహించారు. అధునాత మ్యాపింగ్-గైడెడ్ రిసెకన్ ఎపిలె ప్టోజెనిక్ ఫోకస్ యొక్క ఖచ్చితమైన గుర్తింపు, పూర్తి తొలగింపును సాధ్యం చేసింది. శస్త్రచికిత్స, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం సజావుగా జరిగింది. బాలుడుని ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు.ఈ మైలురాయి గురించి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎపిలెఫ్టాలజిస్ట్ డాక్టర్ సాగర్ గుల్లపల్లి మాట్లాడుతూ, పిల్లలలో ఔషధ-నిరోధక మూర్ఛ వారి జీవన నాణ్యత, అభ్యాసం, రోజువారీ పనీతీరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అధునాతన ఇమేజింగ్ మరియు ఇంట్రా ఆపరేటివ్ ఈ సి ఓ జి ఉపయోగించి మూర్చ, చూపు సమస్యలను ముందుగా ఖచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్స చేయడం మంచి ఫలితాలను అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది. యశోద హాస్పిటల్స్, అత్యాధునిక న్యూరో సర్జికల్ టెక్నాలజీ ద్వారా మద్దతు ఇవ్వబడిన ప్రపంచ స్థాయి ఎపిలెప్సీ కేర్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సురక్షితమైన ప్రభావవంతమైన నిర్వహణ కోసం బహుళ విభాగ నైపుణ్యాన్ని నిర్ధారిస్తూ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ బాల రాజ శేఖర్ చంద్ర పై, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గౌడ్ జంగంపల్లి సహకారంతో ఈ శస్త్రచికిత్స జరిగింది.యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్, పెద్దలకు మూర్ఛ సమస్యకు చికిత్సకు అత్యుత్తమ చికిత్స అందిస్తుంది, అధునాతన న్యూరోఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, మినిమల్లీ ఇన్వాసివ్ న్యూరో సర్జికల్ విధానాలను అందిస్తోంది.యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు (సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పట్, హైటెక్ సిటీ) 4 వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే, అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు. చురుకైన నాయకత్వం, బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది . అరుదైన సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్, సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగనిర్ధారణ, చికిత్సా సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం, అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో 4000 పడకల సామర్థ్యంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ -సేవలను అందిస్తుంది.

Wednesday, November 19, 2025

రాష్ట్ర ఈత పోటీల్లో రెండు రజత పతకాలు సాధించిన రెహమాన్

 

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (ఎస్ ఎన్ ఎమ్ న్యూస్): సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ లో ఎనిమిదోవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్దిఖ్ పెద్దపల్లి జిల్లా సెంచ్నరీ కాలనీ, రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలిచి వివిధ స్టాక్ లో రెండు రజత పతకాలు సాధించిచాడు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసరావు మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ను  అభినందించారు. ఇలాంటి పోటీల్లో రాష్ట్ర దేశస్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు గడించాలని ఆశిస్తున్నానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్ జి ఎఫ్ స్విమ్మింగ్ పోటీలలో అత్యధిక పథకాలను సాధించినందుకు గాను జిల్లా ఇన్చార్జ్ శేషు కుమార్ కు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్విమ్మింగ్ కోచ్, సంగారెడ్డి జిల్లా సిమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ మాట్లాడుతూ అబ్దుర్ రెహమాన్ అండర్ 14 లో బ్రెస్ట్ స్టాక్ 100 మీటర్స్ , ఇండివిజువల్ మెడ్లి 200 మీటర్స్ లో రెండు రజత పథకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డి వై ఎస్ ఓ కాసిం బేగ్ సంతోషం వ్యక్తం చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. డి ఎస్ ఏ సిబ్బంది అభినవ్, దీపిక, పవన్ కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్,కృష్ణ,కుమార్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంగారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (SNM న్యూస్): సంగారెడ్డిలో  ఇందిరా గాంధీ 108 వ జయంతి వేడుకలు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ముందుగా సంగారెడ్డిలో ఐబి వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరా గాంధీ అని, ఆమె కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అని అన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరా గాంధీ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెదక్ పార్లమెంట్  నుండి ఎంపిగా  గెలిచి ప్రధాని అయ్యారు. అప్పటి  మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రామ్ చంద్రా రెడ్డి, బాగా రెడ్డి ల కోరిక మేరకు ఇక్కడి నుండి ఎంపి గా పోటీ చేసి గెలిచారు. ఇందిరా గాంధీ  ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలివ్వాలనే  సంకల్పంతో సంగారెడ్డి కి  ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తెచ్చారు. బిడిఎల్( భారత్ డైనమిక్స్ లిమిటెడ్)  తెచ్చారు, ఇక్రిశాట్ తెచ్చారని, ఈ దేశం లో  ప్రధాన మంత్రి గా  ఇందిరా గాంధీ  చేపట్టిన సంస్కరణలు  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గరిభి హాటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని పారదోలారు. ఈ దేశం లోని భూమి లేని  నిరుపేదలకు, రైతులకు భూములు పంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  ఇల్లు లేని  పేదలకు ఇళ్ల స్థలాలు పంచారు. రోటీ , కపడా ఔర్ మకాన్  నినాదంతో  దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చే కృషి చేశారు. బీజేపీ నాయకులను నేను ఒకటే  ప్రశ్నించదలుచుకున్న చాలా సార్లు  మోడీ , అమిత్ షా, బీజేపీ నేతలు  మాట్లాడుతుంటారు. ఈ దేశం కోసం రక్తం ఇస్తా ప్రాణం ఇస్తాం అని బీజేపీ నేతలు అంటారు. కానీ ఏ బీజేపీ నాయకుడు  ఇంతవరూ ఎవరు ఈ దేశం కోసం రక్తం ఇవ్వలేదు,  ప్రాణం ఇవ్వలేదన్నారు. ఈ దేశం కోసం తన రక్తాన్ని , ప్రాణాలను ఇవ్వడానికి తాను సిద్దం అని ఇందిరా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాదు ఆమె అన్నట్లుగానే ఈ దేశం కోసం తన రక్తాన్ని, ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. దేశం కోసం బీజేపీ నాయకులు ఎవరైనా తన రక్తాన్ని , ప్రాణాలను అర్పించారా? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తౌబాజీ అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్,  జార్జ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, November 15, 2025

ఈనెల 16న జరిగే న్యాయ సాధన దీక్షను జయప్రదం చేయండి

సంగారెడ్డి, నవంబర్ 15 (SNM న్యూస్): బిసి న్యాయ సాధన దీక్ష తెలంగాణ  బి సి జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి  పిలుపుమేరకు తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం నాడు ఉదయము 11 గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగారెడ్డి జిల్లాబిసి  జేఏసీ ఆధ్వర్యంలోన్యాయ  సాధన దీక్ష కలదు ఇట్టి న్యాయసాధన దీక్ష కొత్త బస్టాండ్ పక్కన నటరాజ్ టాకీస్ ముందు దీక్షా స్థలంను ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టిదీక్ష ముఖ్య ఉద్దేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్టి దీక్షను సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గ, పట్టణ మండల కేంద్రాల్లో బీసీ సోదరి సోదరులందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగినది ఇట్టి దీక్ష ను న్యాయవాదులు డాక్టర్లు మేధావి వర్గంఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు యువతియువకులు విద్యార్థిని విద్యార్థులు అన్నిబిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా బీసీ జేఏసీకన్వీనర్ ప్రభుగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సంగారెడ్డి జిల్లాబీసీ జేఏసీ  వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రవి మానస మంగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...

దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి -టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 14 (SNM News):   పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా? మిషన్లు ఓట్లేశాయా? అర్థం కావడం లేదన్నారు. నేను రాహుల్ గాంధీ కి ఒకటే చెప్పదలుచుకున్న, బీహార్ పోతే పోయింది. కానీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. మోతీలాల్ నెహ్రూ,  జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు, ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారు. కొంతమంది  రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరం అని అన్నారు. భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136 వ జయంతి సందర్భంగా  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమంలో  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పాత బస్టాండ్  రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద  బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం లో బాలలు సంతోషంగా పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల జీవిత చరిత్ర ను తెలిపేలా ప్రత్యేక డాన్స్, స్కిట్  లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భారత దేశ అభివృద్ధి కి ప్రధాన మంత్రి గా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టు ల రూపకల్పన, ఐఐటి, ఐఐఎం ల ఏర్పాటు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులు ఈ కార్యక్రమంలో చూపించారు.

Thursday, November 13, 2025

బీసీల ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి -నాయకోటి రాజు

 

సంగారెడ్డి, నవంబర్ 13 (ఎస్ ఎన్ ఎం న్యూస్): రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు ... ఇది మా హక్కు బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసీ, తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో13, 2025 నవంబర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో...బిసీల ధర్మ పోరాట దీక్షలు విజయవంతం చేయాలని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ (బిసి జెఎసి), తెలంగాణ రాష్ట్రం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Friday, October 03, 2025

సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ సస్పెన్షన్

 


సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 3 (SNM NEWS):  

సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ కు సంభందించిన జోగిపేటకు చెందిన యూట్యూబర్ కేసులో రవీందర్ ఎస్ఐ ఒక వ్యక్తి నుండి డబ్బులను అడిగినందుకు గాను, సంబంధిత వ్యక్తి డబ్బులు ఇవ్వలేనని, మన:స్థాపానికి లోనై నదిలోకి దూకి అదృశ్యమయ్యాడు. అందుకు సంబంధించి మిస్సింగ్ అయిన వ్యక్తి  యొక్క భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ  సంగారెడ్డి డీఎస్పీ ద్వారా ప్రాథమిక విచారణ జరిపించి, నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు రూరల్ ఎస్ఐ పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి,  మల్టీ జోన్-2 ఐజీ ఆదేశాల మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఏ స్థాయి లో ఉన్న వారైన శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Monday, September 22, 2025

వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరణన్నవరాత్రి వేడుకలు



సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్, తాటికొండ జగదీశ్వర్, కన్నయ్యగారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ,  సంతోష్ దంపతులు కూర్చున్నారు. 

ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

Tuesday, September 16, 2025

దళిత జర్నలిస్టుల హక్కుల కోసం గళమెత్తనున్న మహాసభ

 

-ఘనంగా సంగారెడ్డిలో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

-సమాజానికి సేవ చేస్తున్న దళిత జర్నలిస్టులకు గౌరవం, భద్రత, ఆర్థిక మద్దతు కల్పించాలని డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (SNM NEWS):

దళిత జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు, వారి సంక్షేమానికి సంబంధించిన కీలక సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్రస్థాయి మహాసభను సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు భారీగా హాజరై, సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు, వారి అభివృద్ధికి చర్యలు తీసుకునేలా చర్చించనున్నట్లు ఫోరం నాయకులు తెలిపారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సమగ్రంగా ప్రభుత్వానికి వినతివత్రాన్ని సమర్పించనున్నారు. జర్నలిస్టుల భద్రత, ఆర్థిక సహాయం, అవకాశాల కల్పన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రతి దళిత జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలనీ, అభయహస్తంగా రూ.12 లక్షల ఆర్ధిక సహాయం అందించాలనీ, ప్రతి జిల్లాకు అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించి వారి భాగస్వామ్యాన్ని పెంచాలనీ, పత్రికలను నిర్వహిస్తున్న దళిత జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ఆదరణ ఇవ్వాలనీ, ప్రతి దళిత జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, సీనియర్ జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులను కేటాయించాలనీ, అకస్మాత్తుగా మరణించిన జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ, జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలనీ, నిరుద్యోగంగా ఉన్న జర్నలిస్టులకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి అందించాలనీ ఫోరం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించి, వారి వృత్తిని గౌరవంగా కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. సమాజానికి సమాచారం అందించే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న దళిత జర్నలిస్టులు తగిన భద్రత, ఆర్థిక మద్దతు, వృత్తి అవకాశాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఈ మహాసభను వేదికగా తీసుకుని, రాష్ట్రస్థాయిలో సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల దళిత జర్నలిస్టులు హాజరై, సమానత్వం, న్యాయం కోసం తమ గళాన్ని వినిపిస్తారని సంగారెడ్డి జిల్లా కమిటీ తెలిపింది.  ఈనెల 19న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను జెడ్పి సమావేశం మందిరంలో టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 19న రవీంద్రభారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ ను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు సమాజానికి సమాచారాన్ని అందించే గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఈ మహాసభ ద్వారా వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి ఆర్ధిక సహాయం, భద్రత, గౌరవాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు. ఈ మహాసభ దళిత జర్నలిస్టుల హక్కుల కోసం గళం విప్పే చారిత్రక సందర్భంగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి దారి చూపే చర్యలకు పునాది వేస్తుందని నాయకులు నమ్ముతున్నారు. 

సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న దళిత జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. వారికి తగిన అక్రిడేషన్ సౌకర్యాలు, ఆర్థిక సహాయం, భద్రత కల్పిస్తేనే వారి వృత్తి స్థిరంగా కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలి. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు మేము రాష్ట్రవ్యాప్తంగా సంఘటితంగా పోరాడతాం అని అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా చలో హైదరాబాద్ దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు తలారి యాదగిరి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల జీవితం సవాళ్లతో నిండినది. సరైన ఆదరణ లేకపోవడం, భద్రత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వారి వృత్తిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇందిరమ్మ ఇండ్లు, ఎక్స్రేషియా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలి. సమాజానికి నిజాన్ని అందించే జర్నలిస్టులను ప్రభుత్వం ఆదరించాల్సిన సమయం ఇది అని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాల వారీగా సమాచారం ఇప్పటికే అందించగా, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సమాచారం అందించే పాత్రలో ఉన్న జర్నలిస్టులు తగిన అవకాశాలు, సౌకర్యాలు, ఆర్ధిక భద్రత పొందాలని, అందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించి, దళిత జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్చలు జరుపు జరుపుతామని, సమాజానికి సమానత్వాన్ని అందించే దిశగా ముందడుగు వేస్తామని ఫోరం నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొని, సమాజానికి న్యాయం సాధించేందుకు కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు దేవదాస్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Monday, September 08, 2025

ఈ నెల 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ నెల 13 వ తేదీన (శనివారం) జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గాన కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం- సమన్యాయం పొందగలరు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో అనగా సంగారెడ్డి ,జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్లలో ఈ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని అందరూ ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్.జి.భవాని చంద్ర కోరనైనది.




Sunday, September 07, 2025

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 11వ రోజు గణనాథుని శోభాయాత్ర, నిమ్మజ్జనం

సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 7 (SNM NEWS): తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణపతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందోత్సాహాల నడుమ కుల మతాలకు అతీతంగా జరిగాయని, 11 రోజులపాటు పూర్తి నిబద్ధతో విధులు నిర్వర్తించి, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి అభినందనలు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేసారు. అదేవిధంగా ప్రశాంతంగా గణపతి ఉత్సవాలను పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా యువత, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు, ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Tuesday, September 02, 2025

రూ.500 కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

 మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన
- టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (సిరి న్యూస్): సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరి కరణ పనులను 500 కోట్లతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్  ఛాంబర్ లో టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, లతో కలిసి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై హెచ్ఎండిఏ, మున్సిపల్ నీటిపారుదల శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ సాగర్ చెరువులో చేపట్టబోయే సుందరీకరణ పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించారు. రూ . 500 కోట్లతో మెహబూబ్ సాగర్ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. సుందరీకరణలో భాగంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ చెరువులోకి కలవకుండా రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 ఎం ఎల్ డి ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా డిజైన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు .మహబూబ్ సాగర్ చెరువు నీటి నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. మహబూబ్ సాగర్ చెరువును టూరిజం, రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. హైవే నుండి ఐఐటి పక్కనుండి మహబూబ్ సాగర్ చెరువు వరకు 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్కు నిర్మలా జగ్గారెడ్డి వివరించారు. ప్రాజెక్టు రెండో దశలో 265 కోట్లతో డిసిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని హెచ్ఎండి అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం ను అభివృద్ధి చేయనున్నట్లు మెహబూబ్ సాగర్ కట్ట వెడల్పు సైక్లింగ్ ట్రాక్ రెండు లైన్ల బిటి రోడ్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో రూ.20 కోట్లతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు కట్ట నుండి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు చెరువు మధ్యలో వాచ్ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుందరీకరణలో భాగంగా రెండో దశ పనులలో చెరువులో ఐలాండ్ లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ల ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రూ.9 కోట్ల తో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులు రూపకల్పన చేసినట్టు అధికారులు వివరించారు. వికలాంగులు వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
 

త్వరలో ముఖ్యమంత్రితో మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
-నిర్మల జగ్గారెడ్డి, టీ జి ఐ సి చైర్మన్

మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా కట్టపై తిరుగుతూ కలెక్టర్ కు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను జగ్గారెడ్డి వివరించారు గతంలో నిధులు లేకుంటే తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, August 31, 2025

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

 

సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 31 (SNM NEWS): శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు అనగా సెప్టెంబర్ 1వ తేది నుండి 30  వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించాలని, అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా యస్.పి.పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...