Sunday, February 01, 2026

ఎనకపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

 

సదాశివపేట, ఫిబ్రవరి 1: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలోని ఎనకపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఎం. దుర్గాప్రసాద్, ఉపసర్పంచ్ ఎండి. ఖాదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పశు వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ గౌడ్ పాడి గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు, సాధారణ వైద్య సేవలు అందించారు. ఎదకు వచ్చిన పాడి గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్లు గ్రామానికి వచ్చి అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయితీ తీర్మానం చేసి గ్రామ కంఠంలో పశువులను అరికట్టేందుకు బోను (ట్రేవిస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేటి దూడలే రేపటి పాడి పశువులవుతాయని, వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవో వి. విజయ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ సి. అర్జునయ్య, గోపాలమిత్రులు టి. కృష్ణ, ఎం. యాదయ్య, ఎం. రమేష్ పాల్గొన్నారు. పాడి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శిబిరంలో భాగంగా రైతులకు పాలు పెరగడానికి అవసరమైన మినరల్ మిక్సర్‌ను ఉచితంగా పంపిణీ చేయగా, అవసరమైన మందులన్నీ కూడా ఉచితంగానే అందజేశారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...