Tuesday, February 24, 2026

శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి మమత రాజు దంపతులు

 


సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని తుల్ జ్జాసింఘ్ భాగ్ ప్రాంగణంలో ఉన్నటువంటి అతిపురాతణమైన మల్లిఖార్జునస్వామి కళ్యాణ మహోత్సవం (1983-84)ఎస్ఎస్సి బ్యాచ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల మిత్రబృందం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథులుగా హాజరై శివ పార్వతుల కళ్యాణవేడుకల్లో పాల్గొని శివ పార్వతులను దర్శించుకున్నారు.తదుపరి అర్చకులమంత్రోచారణతో పులిమామిడి మమత రాజు దంపతులకు పూర్వ విద్యార్థుల బృందం వారందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఆలయం తరపున మేమెంటోను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాలనివాసులు స్వరూప, మాధవి, శశికళ ఆలయ కమిటీ సభ్యులు గంటశివన్న ఈశ్వరమ్మ, కనిగిరి శంకర్ అనురాధ, యాదగిరి రాధ, మాణిక్ ప్రభు మీనా, రమేష్ అపర్ణ, చిన్నపటేల్, పృథ్వీరాజ్, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, రాము, ఆంజనేయులు, అఖిల్, సోమ శంకర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...