Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

Saturday, January 24, 2026

ఐఐటీ హైదరాబాద్ తొలిసారిగా వార్షిక పుస్తక ప్రదర్శన

 

సంగారెడ్డి, జనవరి 23 (SNM న్యూస్): ఐఐటీ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ (కెఆర్‌సి) తన వార్షిక పుస్తక ప్రదర్శన 2026ను శుక్రవారం లెక్చర్ హాల్ కాంప్లెక్స్ (ఎల్‌హెచ్‌సి) కారిడార్‌లో ప్రారంభించింది, ఇది ఈ రకమైన పుస్తక ప్రదర్శనలో ఇదే తొలిసారి. సీనియర్ అధ్యాపకులు మరియు నిర్వాహకుల సమక్షంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. 2026 జనవరి 23–24 తేదీల్లో జరగనున్న ఈ రెండు రోజుల కార్యక్రమం ప్రముఖ ప్రచురణకర్తల నుండి విస్తృత శ్రేణి విద్యా, పిల్లల మరియు సాధారణ-ఆసక్తి పుస్తకాలను ఒకే తాటిపైకి తెస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పుస్తక ప్రియులు ఈ ప్రదర్శనలో చురుకుగా పాల్గొంటున్నారు, ఇది క్యాంపస్‌లో పఠనం, జ్ఞాన నిశ్చితార్థం యొక్క బలమైన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ ప్రొఫెసర్ సాకేత్ అస్థానా ప్రసంగించారు. ప్రొఫెసర్ అశోక్ కుమార్ పాండే డీన్ (విద్యాపరమైన), ప్రొఫెసర్ ప్రేమ్ పాల్, డీన్ (పరిపాలన) వి. వెంకట్ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ డాక్టర్ భోజరాజు గుంజాల్ నేతృత్వంలోని కె ఆర్ సి లైబ్రరీ బృందం సమన్వయం చేస్తోంది.నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ ప్రారంభ ఎడిషన్ ఐ ఐ టి హైదరాబాద్‌లో కొత్త జ్ఞాన చొరవకు నాంది పలుకుతుంది. పుస్తక ప్రదర్శన ఇప్పుడు ప్రతి సంవత్సరం అనేకసార్లు నిర్వహించబడుతుందని, భవిష్యత్ ఎడిషన్‌లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయని కె ఆర్ సి ప్రకటించింది, ఇది ఇన్‌స్టిట్యూట్ యొక్క విస్తరణ, చదవడం, నేర్చుకోవడం, మేధో మార్పిడిని ప్రోత్సహించడంలో నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

Thursday, December 18, 2025

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలి -టిజెయు జిల్లా అధ్యక్షులు ఎం.గిరి


సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సరైయిoది కాదని తెలంగాణ జెర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.గిరి పేర్కొన్నారు. గురువారం టి జె యు నూతన కమిటీ జిల్లా కలెక్టర్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జెర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నాయని తెలిపారు.రాష్ట ప్రభుత్వo  ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది జెర్నలిస్టులే నన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారమైతేనే పారదర్శక, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందిని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు) సంగారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై తక్షణ జోక్యం చేసి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం  సమర్పించా మని పేర్కొన్నారు..ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపకపోవడం విచారకరమన్నారు.  ప్రభుత్వ అధికారుల పనితీరును నిత్యం ప్రజలకు తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు భద్రతా లోపం, ఆర్థిక అస్థిరత, ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ అధికారుల సహకారం  లభించటం లేదన్నారు. జెర్నలిస్ట్ సమస్యల లేమితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లాబ్ ఉన్నా జెర్నలిస్టలకు ప్రయోజనo లేదన్నారు. గడిచిన 20 ఏండ్ల నుంచి ఏ ఒక్క జెర్నలిస్ట్ ఉపయోగపడలేదన్నారు. వేంటనే జెర్నలిస్టులకు ఉపయోగ పడేలా చెర్యలు చేపట్టాలన్నారు. ఒకే వర్గం ఆధిపత్యం లో ఉండటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చెర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు.జర్నలిస్టులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నివాస స్థలాల కేటాయింపు, వెంటనే కల్పించాలన్నారు.నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రెస్ క్లబ్ చైర్మన్ సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని వెంటనే తగిన చెర్యలు చేయట్టాలని పేర్కొన్నారు. అక్రిడేషన్  కమిటీ లో టి జె యు యూనియన్ అవకశాo కల్పించాలన్నారు.  జర్నలిస్టుల సమస్యలు కేవలం సంక్షేమ సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి వృత్తి గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించినవని టీజెయు స్పష్టం చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా వార్తలు రాయాలంటే వృత్తి భద్రత అత్యంత కీలకమని పేర్కొంది.అందుకే జిల్లా యంత్రాంగం ఈ వినతిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సంగారెడ్డి జిల్లా టీజెయు కమిటీ చేసిన ఈ ప్రయత్నం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తయని ప్రభుత్వ చెర్యలు కూడిన పాలన, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. అప్పుడు మాత్రమే ప్రజల తరఫున నిలబడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని టీజెయు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు నిజంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడానికి, జిల్లా కలెక్టర్ వెంటనే   స్పందించి చెర్యలు చేపపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు), సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్ పోచగౌడ్ మహేష్ గౌడ్ కార్య వర్గ సభ్యులు రాజేష్, గణేష్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Tuesday, December 16, 2025

రూ.118కోట్ల విద్యుత్ బకాయిలు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి..!

 


సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS): గీతం డీమ్డ్ యూనివర్సిటీ బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్  బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ.118కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఎస్పీడీసీఎల్ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, యూనివర్సిటీ దాఖలు చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతోపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు రూ.1000 బిల్లు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్ను తొలగిస్తున్నారని.. అలాంటిది యూనివర్సిటీకి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని.. సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.

నూతన సంవత్సర వేడుకలపై పోలీస్ మార్గదర్శకాలు – భద్రత అవసరమా? కఠినత అతిగా మారుతోందా?



- శాంతిభద్రతల పేరుతో నియంత్రణల పెరుగుదల

- పౌర స్వేచ్ఛ–ప్రజా భద్రత మధ్య సమతుల్యత అవసరం

- నిబంధనలు పాటించాలా? లేక భయ వాతావరణం సృష్టించాలా?

డెస్క్, డిసెంబర్ 16 (SNM NEWS):నూతన సంవత్సరం వేడుకలు అంటే ఉత్సాహం, ఆనందం, కొత్త ఆశల ప్రారంభం. కానీ ప్రతి ఏడాది డిసెంబర్ 31 దగ్గరపడగానే పోలీస్ మార్గదర్శకాలు, ఆంక్షలు, హెచ్చరికల జాబితాలు ముందుకు వస్తున్నాయి. స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లకు అనుమతులు, సీసీటీవీలు, శబ్ద నియంత్రణ, మద్యం పరిమితులు, డ్రంక్ డ్రైవింగ్ హెచ్చరికలు – ఇవన్నీ భద్రత కోసమేనని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే: ఇవన్నీ నిజంగా ప్రజల భద్రత కోసమేనా? లేక కఠినత అతిగా మారుతోందా? ప్రజా భద్రత ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. గతంలో జరిగిన ప్రమాదాలు, డ్రంక్ డ్రైవింగ్ కేసులు, మహిళలపై నేరాలు, అల్లర్లు చూసినప్పుడు పోలీసుల అప్రమత్తత అర్థవంతమే. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమే. ఈ కోణంలో చూస్తే శబ్ద నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు సమంజసంగానే కనిపిస్తాయి.

కానీ సమస్య అక్కడ మొదలవుతోంది. నిబంధనలు భద్రత కోసం కాకుండా, భయాన్ని సృష్టించే స్థాయికి చేరితే పరిస్థితి మారుతుంది. ప్రతీ వేడుకను అనుమానంతో చూడటం, ప్రతి పౌరుడిని నేరస్థుడిలా భావించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. “రాత్రి 10 తర్వాత శబ్దం లేదు”, “1 గంట తర్వాత అన్నీ మూసివేయాలి”, “ప్రతి అడుగుకి కేసు” అన్న భావన ప్రజల్లో ఉత్సవ భావనను చంపేస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఆర్థిక ప్రభావం. హోటళ్లు, పబ్‌లు, ఈవెంట్ మేనేజర్లు ఈ నిబంధనల వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందస్తు అనుమతులు, భద్రతా సిబ్బంది, సాంకేతిక ఏర్పాట్లు – ఇవన్నీ చిన్న, మధ్యస్థ వ్యాపారాలకు భారంగా మారుతున్నాయి. పెద్ద సంస్థలు తట్టుకోగలిగినా, చిన్న వ్యాపారాలు మాత్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం చూపుతోంది.

డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు అవసరమే. కానీ అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సమాంతరంగా ఉండాలి. “మద్యం తాగితే కేసు” అనే హెచ్చరిక సరిపోదు; సురక్షిత రవాణా సదుపాయాలు, క్యాబ్ సేవలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రాత్రివేళల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది శిక్ష విధించే పాలనగా మాత్రమే మిగిలిపోతుంది.మహిళల భద్రత అంశంలో షీ టీమ్స్, పర్యవేక్షణ అవసరం. కానీ అదే సమయంలో మహిళలు కూడా స్వేచ్ఛగా వేడుకల్లో పాల్గొనే వాతావరణం ఉండాలి. భద్రత పేరుతో అనవసర జోక్యాలు, వేధింపులు జరిగితే, అది రక్షణ కాదు నియంత్రణగా మారుతుంది. భద్రత అనేది స్వేచ్ఛను కాపాడాలి, దాన్ని కుదించకూడదు.

ఇక్కడ సమతుల్యత కీలకం. ప్రజా భద్రత–పౌర స్వేచ్ఛ మధ్య సమతుల్యతే మంచి పాలనకు ప్రమాణం. కఠినత అవసరమైన చోట ఉండాలి, కానీ సాధారణ పౌరుడిని శత్రువులా చూడకూడదు. పోలీస్ శాఖ ప్రజలకు భద్రతా భాగస్వామిగా ఉండాలి, శిక్ష విధించే యంత్రాంగంగా మాత్రమే కాదు.నూతన సంవత్సరం వేడుకలు ఒక్కరోజు ఆనందం మాత్రమే కాదు; సమాజ మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం. నియంత్రణలు అవసరమే కానీ అవి వివేకంతో ఉండాలి. భద్రతను సాధించాలంటే నిబంధనలు మాత్రమే కాదు, నమ్మకం కూడా అవసరం. ఆ నమ్మకాన్ని నిర్మించడమే నిజమైన ప్రజాస్వామ్య భద్రత.

మూడవ విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య



సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS):

జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.మూడవ విడతలో జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో సింగిల్ నామినేషన్ అభ్యర్థి ఉపసంహరణ చేసుకున్న కారణంగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మూడవ విడత ఎన్నికలు జరగనున్న 8 మండలాల్లో మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,13,019 మంది పురుషులు, 1,12,456 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని ఆమె వివరించారు. పోలింగ్ నిర్వహణకు గాను  1769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు 2477 మంది పోలింగ్ అధికారులు (POలు), 2762 మంది ఓపిఓ లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 351 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వివరాలు: కల్హేర్ మండలం – కల్హేర్ జడ్‌పీహెచ్‌ఎస్.

కంగ్టి మండలం – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల

మనూర్ మండలం – జడ్‌పహెచ్ హైస్కూల్

నాగల్ గిద్ద మండలం – జిల్లా పరిషత్ హై స్కూల్

నారాయణఖేడ్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నిజాంపేట్ మండలం – నిజాంపేట్ జడ్‌పీహెచ్‌ఎస్

సిర్గాపూర్ మండలం – ఎంపీడీవో కార్యాలయం

న్యాల్కల్ మండలం – ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైతు వేదిక లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, పారదర్శక ఎన్నికలకు సహకరించాలని  కలెక్టర్   కోరారు.

Tuesday, December 09, 2025

నందిగామలో విక్రమ్ గౌడ్‌ను విజయం దిశగా నడిపించండి: కాట శ్రీనివాస్ గౌడ్

 

సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 9 (SNM న్యూస్):: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కు మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపను సందర్శించి గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి, కర పత్రాలను అందజేస్తూ గ్రామ అభివృద్ధికి విక్రమ్ గౌడ్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు అత్యవసరమని వివరించారు. అభివృద్ధి కోసం, పారదర్శక పాలన కోసం, గ్రామం కోసం—తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి విక్రమ్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామస్థులను కోరారు.

Thursday, November 20, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజు

  

హైదరాబాద్, నవంబర్ 20( SNM న్యూస్):దళిత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్ ) కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రాపాక విజయరాజును నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏ. డేవిడ్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కాశ పోగు జాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో  ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా రాపాక విజయరాజుకు నియామక పత్రం అందజేయడం జరిగింది.జిల్లా స్థాయి కార్యకలాపాలను బలోపేతం చేయడానికి, జర్నలిస్టు సమస్యలను మరింత ప్రభావవంతంగా పరిష్కరించడానికి రాపాక విజయరాజు నియామకం చేపట్టినట్లు ఫోరం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఫోరం వ్యవస్థాపకుడు కాశపోగు జాన్ ప్రభుత్వం దృష్టికి రెండు ముఖ్యమైన డిమాండ్లను తీసుకొచ్చారు. దళిత జర్నలిస్టులకు రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీలో తక్షణమే ప్రతినిధిత్వం కల్పించాలని. అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని దళిత జర్నలిస్టులకు మొదటి విడతలోనే మంజూరు చేయాలని జర్నలిస్టుల హక్కుల కోసం ఫోరం ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, దళిత జర్నలిస్టుల పురోగతికి ఈ నిర్ణయాలు అత్యంత కీలకమని కాశపోగు జాన్ స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాపాక విజయరాజు, మెదక్ జిల్లాలో దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తానని ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులందరినీ ఏకతాటిపై తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం  రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి ఎల్లేష్ జగత్ ప్రకాష్ పెద్దింటి స్వామి శ్రీకాంత్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Monday, September 22, 2025

పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టెడన్నం పెడదాము, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ,  పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. సోమవారం పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకె యువసేన నాయకులు. ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు, పిఎంకె యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



Saturday, September 20, 2025

దళిత జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా -మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 20 (SNM NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నుండి వచ్చిన దళిత జర్నలిస్టులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సోదరుల హక్కులు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితుల సమస్యలపై ఇప్పటికే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు. బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయిస్తే దళితుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, దళితుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నేను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి భరోసా ఇచ్చారు. దళితుల అభ్యున్నతికి తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, నేను కూడా అదే మార్గంలో నడుస్తూ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దళితుల భూమి సమస్యపై అన్యాయం జరగకూడదని అప్పుడు కూడా తన కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దళితుల కోసం నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాగు జాన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రాపాక విజయరాజు, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...