సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:
Post a Comment