Thursday, February 05, 2026

12వ వార్డులో రాము సాహితికి బ్రహ్మరథం

                                                                                                                                                                     


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణం 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితికి వార్డు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి 12వ వార్డులో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి, రాము సాహితికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల పాలనలో 12వ వార్డులో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వార్డులో చేపట్టిన చాలా పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. రాము సాహితిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...