Showing posts with label MIMPARTY. Show all posts
Showing posts with label MIMPARTY. Show all posts

Sunday, May 17, 2026

జనగణనలో ప్రజలు సహకరించాలి -సంగారెడ్డిలో ఎంఐఎం నేతల మీడియా సమావేశం

 

సంగారెడ్డి ప్రతినిధి, మే 16: కర్వాన్ ఎమ్మెల్యే, సంగారెడ్డి ఇన్‌చార్జి కౌసర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎంఐఎం పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యుల వివరాలను సరైన ఆధార పత్రాలతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు, విద్యార్హతలు తదితర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశిత గడువులోగా జనగణన నమోదు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఓటరు జాబితాలో పేర్లు లేకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంటింటికి వచ్చే గణన సిబ్బందికి ప్రజలు సహకరించి అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యక్తిగత సహాయకుడు ముస్తాక్ మాట్లాడుతూ, జనగణన సమయంలో పేర్లు, ఇంటి పేర్లు, తండ్రి పేర్లు తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయించాలని సూచించారు. తప్పులు జరిగితే ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముస్తాక్ సాహెబ్, ఎం.కె. నజీముద్దీన్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాకూబ్ అలీ, కౌన్సిలర్ ఏజాజ్, కార్యదర్శి ఇమ్రాన్ జైన్, యువ నాయకుడు సామి, జహంగీర్ భాయ్, మాజీ కౌన్సిలర్ అజ్జు భాయ్, షకీల్ భాయ్, రఫీ భాయ్, అస్లాం భాయ్, ఖాజా భాయ్, ఒమర్ భాయ్, సద్దాం జుల్కల్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...