సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్, తాటికొండ జగదీశ్వర్, కన్నయ్యగారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ, సంతోష్ దంపతులు కూర్చున్నారు.
ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.


No comments:
Post a Comment