Monday, September 22, 2025

వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరణన్నవరాత్రి వేడుకలు



సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్, తాటికొండ జగదీశ్వర్, కన్నయ్యగారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ,  సంతోష్ దంపతులు కూర్చున్నారు. 

ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...