Wednesday, November 19, 2025

సంగారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (SNM న్యూస్): సంగారెడ్డిలో  ఇందిరా గాంధీ 108 వ జయంతి వేడుకలు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ముందుగా సంగారెడ్డిలో ఐబి వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరా గాంధీ అని, ఆమె కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అని అన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరా గాంధీ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెదక్ పార్లమెంట్  నుండి ఎంపిగా  గెలిచి ప్రధాని అయ్యారు. అప్పటి  మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రామ్ చంద్రా రెడ్డి, బాగా రెడ్డి ల కోరిక మేరకు ఇక్కడి నుండి ఎంపి గా పోటీ చేసి గెలిచారు. ఇందిరా గాంధీ  ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలివ్వాలనే  సంకల్పంతో సంగారెడ్డి కి  ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తెచ్చారు. బిడిఎల్( భారత్ డైనమిక్స్ లిమిటెడ్)  తెచ్చారు, ఇక్రిశాట్ తెచ్చారని, ఈ దేశం లో  ప్రధాన మంత్రి గా  ఇందిరా గాంధీ  చేపట్టిన సంస్కరణలు  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గరిభి హాటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని పారదోలారు. ఈ దేశం లోని భూమి లేని  నిరుపేదలకు, రైతులకు భూములు పంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  ఇల్లు లేని  పేదలకు ఇళ్ల స్థలాలు పంచారు. రోటీ , కపడా ఔర్ మకాన్  నినాదంతో  దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చే కృషి చేశారు. బీజేపీ నాయకులను నేను ఒకటే  ప్రశ్నించదలుచుకున్న చాలా సార్లు  మోడీ , అమిత్ షా, బీజేపీ నేతలు  మాట్లాడుతుంటారు. ఈ దేశం కోసం రక్తం ఇస్తా ప్రాణం ఇస్తాం అని బీజేపీ నేతలు అంటారు. కానీ ఏ బీజేపీ నాయకుడు  ఇంతవరూ ఎవరు ఈ దేశం కోసం రక్తం ఇవ్వలేదు,  ప్రాణం ఇవ్వలేదన్నారు. ఈ దేశం కోసం తన రక్తాన్ని , ప్రాణాలను ఇవ్వడానికి తాను సిద్దం అని ఇందిరా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాదు ఆమె అన్నట్లుగానే ఈ దేశం కోసం తన రక్తాన్ని, ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. దేశం కోసం బీజేపీ నాయకులు ఎవరైనా తన రక్తాన్ని , ప్రాణాలను అర్పించారా? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తౌబాజీ అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్,  జార్జ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...