Thursday, November 20, 2025

చిన్నారికి డ్రగ్-రిఫ్రాక్టరీ ఎపిలెప్సీకి ఇమేజ్- గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమీని విజయవంతంగా నిర్వహించిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్

 

సంగారెడ్డి, 19 నవంబర్ (SNM న్యూస్): హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ లెఫ్ట్ ప్యారిటల్ ఫోకల్ కార్టికల్ డిపార్డైసియా వల్ల కలిగిన డ్రగ్-రిఫ్రాక్టరీ ఫోకల్ ఎపిలెప్పీతో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడు. కపిల్ రెడ్డి దర్మారెడ్డికి విజయవంతంగా చికిత్స అందించింది. మూడు యాంటీ-ఎపిలెప్టిక్ మందులు వాడుతున్నప్పటికీ, ఆ బాలుడు తల, కళ్ళలో టానిక్ డీవియేషన్ లక్షణాలను అనుభవిస్తున్నాడు, దానితో పాటు కొంత సమయం స్పృహ కోల్పోతున్నాడు. మల్టీమోడల్ ఇమేజింగ్ న్యూరోలాజికల్ పరీక్షల తర్వాత, వైద్య బృందం శస్త్రచికిత్సను సిఫార్సు చేసింది. 21 ఫిబ్రవరి 2025న, పేషేంట్ కు ఎలక్ట్రోకార్టికోగ్రామ్ తో లెఫ్ట్ ఇమేజ్-గైడెడ్ క్రానియోటమీ, లెసియోనెక్టమ్ నిర్వహించారు. అధునాత మ్యాపింగ్-గైడెడ్ రిసెకన్ ఎపిలె ప్టోజెనిక్ ఫోకస్ యొక్క ఖచ్చితమైన గుర్తింపు, పూర్తి తొలగింపును సాధ్యం చేసింది. శస్త్రచికిత్స, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం సజావుగా జరిగింది. బాలుడుని ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు.ఈ మైలురాయి గురించి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎపిలెఫ్టాలజిస్ట్ డాక్టర్ సాగర్ గుల్లపల్లి మాట్లాడుతూ, పిల్లలలో ఔషధ-నిరోధక మూర్ఛ వారి జీవన నాణ్యత, అభ్యాసం, రోజువారీ పనీతీరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అధునాతన ఇమేజింగ్ మరియు ఇంట్రా ఆపరేటివ్ ఈ సి ఓ జి ఉపయోగించి మూర్చ, చూపు సమస్యలను ముందుగా ఖచ్చితంగా గుర్తించి శస్త్రచికిత్స చేయడం మంచి ఫలితాలను అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది. యశోద హాస్పిటల్స్, అత్యాధునిక న్యూరో సర్జికల్ టెక్నాలజీ ద్వారా మద్దతు ఇవ్వబడిన ప్రపంచ స్థాయి ఎపిలెప్సీ కేర్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సురక్షితమైన ప్రభావవంతమైన నిర్వహణ కోసం బహుళ విభాగ నైపుణ్యాన్ని నిర్ధారిస్తూ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ బాల రాజ శేఖర్ చంద్ర పై, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ గౌడ్ జంగంపల్లి సహకారంతో ఈ శస్త్రచికిత్స జరిగింది.యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్, పెద్దలకు మూర్ఛ సమస్యకు చికిత్సకు అత్యుత్తమ చికిత్స అందిస్తుంది, అధునాతన న్యూరోఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, మినిమల్లీ ఇన్వాసివ్ న్యూరో సర్జికల్ విధానాలను అందిస్తోంది.యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్ లు (సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పట్, హైటెక్ సిటీ) 4 వేల పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవంతులైన వైద్యులచే, అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికి చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు. చురుకైన నాయకత్వం, బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది . అరుదైన సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్, సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగనిర్ధారణ, చికిత్సా సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం, అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో 4000 పడకల సామర్థ్యంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ -సేవలను అందిస్తుంది.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...