Wednesday, December 17, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన నూతన సర్పంచ్ లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ - సతీష్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చంతో సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి విజేందర్ రెడ్డి ఆర్.వెంకటేశ్వర్లు, పీ.నర్సింలు ,మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, సందీప్, జలంధర్ , పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...