Thursday, December 18, 2025

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...