జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్
సంగారెడ్డి, జనవరి 25:—ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా కుటుంబ భరోసా స్కీమ్లో చేరాలని సంగారెడ్డి జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ అన్నారు.శనివారం సంగారెడ్డి పట్టణంలోని పద్మశాలి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు సభ్యులందరి నుంచి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ, సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు ఇవి:
కుటుంబ భరోసా స్కీమ్, TGPVWA యాప్ కార్యక్రమం
ఆధునిక ఏఐ సాంకేతికత – ప్రాముఖ్యత, వినియోగాలు
ఎల్ఈడీ వాల్, డ్రోన్, సినిమాటిక్ ఫోటోగ్రఫీ
సంఘ సభ్యత్వం – ప్రాధాన్యత
జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలు
ఫోటోగ్రాఫర్ల వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు
జిల్లా, మండల కార్యవర్గ లోపాలపై సమీక్ష
జిల్లా స్థాయిలో ఒకే ధరల జాబితా (ప్రైస్ లిస్ట్) అంశం
జిరాక్స్ కేంద్రాలు, ఇతర దుకాణాల్లో పాస్పోర్ట్ ఫోటోలు తీయడంపై చర్చ
స్థానిక సమస్యలు, సభ్యుల అభిప్రాయాల సేకరణ
ఫోటోగ్రాఫర్లకు వర్క్షాప్లు, అవగాహన సదస్సులు
ఈఎస్ఐ వంటి సంక్షేమ అంశాలు
కుటుంబ భరోసా స్కీమ్లో ఇంకా నమోదు చేసుకోని ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఈ పథకం ప్రాముఖ్యతను తెలియజేసి సభ్యత్వం కల్పించే బాధ్యత మండల స్థాయి పీఎస్టీ లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.జి ల్లా కార్యవర్గ సభ్యులందరూ అంకితభావంతో పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి బాలరాజ్, తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment