Monday, July 27, 2026

ఎల్లమ్మ తల్లికి ఆషాడమాస భోనాలు


రాయికోడ్, జులై 26: రాయికోడ్ మండల పరిధిలోని మాటూర్ గ్రామంలో ఆదివారం ఆషాడమాసం బోనాలు పురస్కరించుకొని గ్రామంలో కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి బోనాల మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మహిళలు, ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లతో ఆటపాటలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి రేణుక ఎల్లమ్మ తల్లికి భోనాలు నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...