సంగారెడ్డి ప్రతినిధి, జూలై 7 (SNM NEWS):
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయా రెడ్డి జన్మదిన వేడుకలను కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి జగ్గారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి మాట్లాడుతూ, జగ్గారెడ్డి ప్రజాసేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
పేదల సంక్షేమానికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం సంగారెడ్డిలో నిర్వహించిన ప్రధాన జన్మదిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జగ్గారెడ్డికి పూలగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి మల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగ్గారెడ్డి జన్మదిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment