సంగారెడ్డి బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SV బేకరీని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, వ్యాపార సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, చీల మలన్న, రఘు, సర్పంచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment