సంగారెడ్డి పట్టణం లోని 22 వ వార్డ్ రామ్ నగర్ లో గ్రామైక్య మహిళా సంఘ సభ్యులకు నిర్మలా జగ్గారెడ్డి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రామ్ నగర్, రామ్ మంధిర్ లోని ఆమె స్వగృహం లో , స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యం లో ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఉందని, ఏ ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని, గత ప్రభుత్వం లో పంపిణీ చేసిన చీరలను పొలాల వద్ద బెదురు కోసం వాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, వార్డు పెద్దలు కల్పన తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Monday, June 01, 2026
రామ్ నగర్, 22 వ వార్డులో గ్రామైక్య సంఘ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment