Thursday, May 21, 2026

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

 


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్

సంగారెడ్డి, మే 20 : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంగారెడ్డి వలయ సాధారణ సమావేశం మంగళవారం జిల్లా విద్యుత్ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో పలువురు వక్తలు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వము ఉద్యోగులకు రావలసిన వేతన సవరణలు (పీఆర్సీ) తక్షణమే అమలు చేయాలని కోరారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి జాప్యం లేకుండా న్యాయబద్ధంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విద్యుత్ సంస్థ యాజమాన్యం నుండి ఉద్యోగులకు అందవలసిన పలు సంక్షేమ అంశాలు, సేవా సంబంధిత సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు నరసింహ, ఎం. సుధాకర్, సంగారెడ్డి వలయ అధ్యక్షుడు వినయ్ కుమార్, ఉప వలయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...