సంగారెడ్డి, మే 20 :ప్రజల్లో న్యాయంపై అవగాహన పెంపొందించేందుకు ఏపీసీఆర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నగరంలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు వి. రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ ఫైసల్, భారత్ సాయి, వరయ్య యాదవ్, షహానా మేడం, న్యాయవాది సోహైల్ అలీ, కౌన్సిలర్ నవాజ్, మిల్లీ ఫోరం ప్రతినిధి షఫీయూర్ రహ్మాన్, కన్వీనర్ అబ్దుల్ మన్నాన్, ఏపీసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముక్తార్ హుస్సేన్, మౌలానా షేక్ ముబీన్, న్యాయవాది మనోహర్, ఒవైస్ ఉద్దీన్ ఒవైస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పలువురు యువకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment