Thursday, May 21, 2026

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

 


రోగులకు పండ్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి, మే 21: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో గురువారం ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ పార్కులో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, యువతకు అవకాశాలు కల్పించడంలో, సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, కౌన్సిలర్లు తోపాజి వీణ హరీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...