Sunday, March 01, 2026

పట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లకు సన్మానం ముఖ్య అతిథిగా హాజరైన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి*

 నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ లతో పాటు పలువురు కౌన్సిలర్ లను పట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమీపం లోని ఎస్ఎస్ కే భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ లతో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు తోపాజీ వీణా హరీష్, శ్రీకాంత్ గౌడ్, సంగీతా మహేష్ ల ను పట్కర్ సమాజ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, పట్కర్ సమాజ్ అధ్యక్షుడు కోనేరీ చందర్, మాజీ ప్రధాన కార్యదర్శి చవాన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...