సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 01 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS అంతము - మన పంతము )ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి గెలిచినటువంటి వారి సతీమణి.పులిమామిడి మమతను కలిసి వారిని శాలువాతో సన్మానించి, హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పోల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజులలో మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని రాజుకి తెలియపరచారు. మీరు చేసిన సేవలను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ మర్చిపోలేరని అన్నారు. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఉండేటువంటి టీచర్స్ కి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొనుటకుగాను ఎటువంటి భవనం లేదని వారికి తెలియపరిచారు. అందుకోసం సదాశివపేట పట్టణంలో ఉండేటటువంటి ఉపాధ్యాయుల కొరకు టీచర్స్ భవనం కట్టుకునేందుకుగాను గవర్నమెంట్ పక్షాన ఒక స్థలాన్ని ఏర్పాటు చేయుటకు కృషి చేయాలని పోల శ్రీనివాస్ పులిమామిడి రాజుకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి విషయానికి పులి మామిడిరాజు స్పందించి అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి స్థలాన్ని ఇప్పించడానికి కృషి చేస్తానని వారికి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వారి మిత్రులు విజయ్ కుమార్, సోమ శంకర్ మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Sunday, March 01, 2026
12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడిమమత రాజులను సన్మానించిన పోల శ్రీనివాస్ మిత్ర బృందం
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment