సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 7 (SNM న్యూస్):అం తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు అనగా మార్చి 8 ఆదివారం రోజున జహీరాబాద్లో మహిళల కోసం భారీ ఉచిత ఆరోగ్య, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఫౌండర్, ట్రస్టి పైలెట్ బాబి అజ్మీరా ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం జహీరాబాద్లోని పాస్తాపూర్ రోడ్డులో గల డాక్టర్ ఆర్ ఎల్ ఆర్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరం ప్రత్యేకతలు, ముందస్తు గుర్తింపు: రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఉచిత సేవల వివరాలు అనుభవజ్ఞులైన స్టార్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత సంప్రదింపులు, వెల్నెస్ స్క్రీనింగ్ నిర్వహించబడును. ఎవరు హాజరుకావచ్చు: 40 నుండి 65 ఏళ్ల లోపు వయస్సు గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్క్రీనింగ్ చేయించుకోవాలనుకునే వారు తమ పాత మెడికల్ రిపోర్టులు (ఉంటే) వెంట తీసుకురావాలి. శిబిరంలో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇతర వివరాల కోసం మరియు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం 94900 59175 నంబర్ను సంప్రదించగలరు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఈ ఉచిత శిబిరాన్ని జయప్రదం చేయాలని ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్, స్టార్ హాస్పిటల్స్ బృందం కోరారు.

No comments:
Post a Comment