Sunday, May 10, 2026

రక్తదానం ప్రాణదానం : డాక్టర్ స్వామి గౌడ్


 సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సన్‌రైజ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వామి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్పత్రి ప్రాంగణంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు, డాక్టర్ స్వామి గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామి గౌడ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సేవల్లో రక్తం కొరత ఏర్పడే పరిస్థితులు తరచుగా ఎదురవుతాయని, ఆ సమయంలో రక్తదానం చేసినవారి సహకారమే ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో రక్త నిల్వలు తగ్గిపోతాయని గుర్తించి ప్రతి ఏడాది మే నెలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతోనే సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే సన్‌రైజ్ హాస్పిటల్‌లో నూతనంగా కార్డియాలజీ సేవలను ప్రారంభించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా గుండె సంబంధిత వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ స్వామి గౌడ్ కోరారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...