Sunday, March 01, 2026

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆయుధ కర్మాగారంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 01 (SNM న్యూస్): కంది మండలం ఆయుధ కర్మాగారంలో శనివారం ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. తరువాత విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రయోగాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్. విజయభాస్కర్ మాట్లాడుతూ 1928 లో సర్ సివి రామన్ కనుక్కున్న ' రామన్ ఎఫెక్ట్ 'కు గౌరవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సివి రామన్ కు 'రామన్ ఎఫెక్ట్' కనుక్కున్నందుకు 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 2026 సైన్స్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం "సైన్స్ లో స్త్రీలు వికసిత భారత్ కు వారిని ఉత్ప్రేరణ చేయడం" అనే తీముగా నిర్ణయించిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేసి జాతీయ అభివృద్ధికి పాటుపడేటట్లు చేయడం అన్నారు. వివిధ పోటీలలో ప్రతిభా ప్రదర్శించిన విద్యార్థులకు బహుమ తులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ. శ్రీనివాసరావు, కె. సంధ్య ,సలోమి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...