Sunday, January 25, 2026

పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ కృషి అభినందనీయం

రాయికోడ్, జనవరి 23(SNM న్యూస్): తమ పాఠశాల అభివృద్ధి కోసం సహాకారం చేస్తున్న మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కృషి అభినందనీయమని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్, ఎంఈఓ మానయ్య, కర్చల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నర్సింలు అన్నారు. రాయికోడ్ మండలం మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ స్వంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్ లు, ఐడెంటిటీ కార్డులు పంపిణి చేశారు. అంతకు ముందు మామిడిపల్లి గ్రామానికి నూతనంగా మంజూరైనా ప్రీ ప్రైమరి క్లాస్ రూమ్ ను ఎంపిడిఓ, ఎంఈఓ, కంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు తో ప్రయివేట్ పాఠశాల కు దీటుగా బోధన, మంచి సౌకర్యాlu ఉంటాయన్నారు. పాఠశాలల బలోపేతం గ్రామభివృద్ధికి కీలకమని దాతల సాయం ఆ దిశగా మంచి ప్రయత్నమని అభినందించారు. అనంతరం అక్షయ పాత్ర భోజనాన్ని పిల్లలకు వడ్డించి వారు రుచి చూశారు. కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ దేవి, పంచాయతీ కార్యదర్శి బస్వారాజు, వార్డ్ సభ్యులు,  మాజీ పీ.ఎ.సి.ఎస్ చైర్మన్ నజీర్, దాత బగిలి సమీర్ ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వీఓఏ మల్లేశం, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు భీమ్ రావు, మాణిక్యయ్య, అంజి, హాసన్ పటేల్, శంకర్, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...