Monday, January 26, 2026

డీఆర్డీఏ–ఐకేపీ ఏపీఎం సోమా శివలక్ష్మికి ప్రశంస, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం ప్రదానం

 

సంగారెడ్డి, జనవరి 26 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలంలో డీఆర్డీఏ–ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సోమా శివలక్ష్మిని జిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. మండలంలోని గ్రామాలకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్, టీజీఐసీ చైర్‌పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో సోమా శివలక్ష్మి సమర్థవంతంగా పనిచేస్తూ, స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఆమె సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఉత్తమ ఉద్యోగులను సన్మానించగా, సోమా శివలక్ష్మికి లభించిన ఈ గౌరవం డీఆర్డీఏ–ఐకేపీ సిబ్బందికి ప్రోత్సాహకరంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...