సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 21 (SNM న్యూస్):ప్రపంచస్థాయి వైద్యం, అత్యాధునిక ట్రాన్స్ప్లాంట్ సేవలు, ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాలతో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ భారతదేశంలోని ఏకైక ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా నిలిచిందని యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా తెలిపారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్లోబల్ ప్రమాణాలు కలిగిన ఎక్స్ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ఈఎల్ఎస్ఓ) ద్వారా లైఫ్ సపోర్ట్లో అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును యశోద హాస్పిటల్స్ అందుకున్నందుకు గర్వంగా ఉన్నట్లు చెప్పారు. ఈ గుర్తింపుతో యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే ఏకైక ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. ప్లాటినం–సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా వీవీఏ, వీవీ, ఈసీపీఆర్, అవేక్ ఈసీఎంఓతో పాటు కాంప్లెక్స్ మల్టీ–ఆర్గాన్ సపోర్ట్ సేవలను యశోద హాస్పిటల్స్ అందిస్తోందని తెలిపారు. అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్లు, పెర్ఫ్యూషనిస్టులు, ట్రాన్స్ప్లాంట్ వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సుల బృందం ఈ సేవలకు మద్దతుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక పర్యవేక్షణ, కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణమైన ప్రోటోకాల్స్తో 24 గంటల క్రిటికల్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, ఎముక మజ్జ మార్పిడితో సహా సమగ్ర అవయవ మార్పిడి సేవలు అందిస్తూ, ఎండ్స్టేజ్ గుండె, శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈసీఎంఓ ద్వారా ప్రాణరక్షక మద్దతు అందిస్తున్నట్లు డాక్టర్ వెంకట్ రామన్ కోలా వెల్లడించారు.

No comments:
Post a Comment