Wednesday, December 31, 2025

సంగారెడ్డిలో రాష్ట్రీయ బసవదల్ జిల్లా కమిటీ ఏర్పాటు -పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం

 

సంగారెడ్డి, డిసెంబర్ 31 (SNM MEDIA):తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ బసవదల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శంకర్ పాటిల్, అనిల్ పాటిల్‌ల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రీయ బసవదల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమ పూజ్య ద్వితీయ మహిళ జగద్గురు బసవధర్మ పీట అధ్యక్షులు డాక్టర్ గంగా మాతాజీ హాజరై, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రీయ బసవదల్ పాలకవర్గ సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులుగా సిహెచ్ శరణ్ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి. నాగుల్, జనరల్ సెక్రటరీగా సూర్యకాంత్, ట్రెజరర్‌గా ఎన్. యశ్వంత్ కుమార్ నియమితులయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా వీరిశెట్టి, జి. శివకుమార్, సెక్రటరీగా మహేష్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్య సలహాదారులుగా భీమాని మల్లప్ప, బి. శివకుమార్, ఏ. శేఖర్‌లను నియమించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగా మాతాజీ మాట్లాడుతూ బసవధర్మ సూత్రాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లే దిశగా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. సమాజ సేవ, ఐక్యత, నైతిక విలువల పరిరక్షణలో రాష్ట్రీయ బసవదల్ పాత్ర మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బసవదల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...