Friday, January 30, 2026

రాజంపేట 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుష్మిత ప్రశాంత్ కుమార్ నామినేషన్

 భారీ జనసంద్రం, కార్యకర్తలు–కాలనీవాసుల హాజరు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 29 (SNM NEWS) :

రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ధర్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, కాలనీవాసులు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయడానికి వెళ్లారు. వార్డు పరిధిలో నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో రాజంపేట ప్రాంతం జనసంద్రంగా మారింది. అభ్యర్థికి స్థానిక ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని ఈ ర్యాలీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ముఖ్య నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కాశ్మీర్ రాజు, ఎంఆర్ఎఫ్ శ్రీనివాస్, పట్లూరి శ్రీనివాస్, తోట జగన్మోహన్, వడ్ల వెంకటేశం, గన్నారం చంద్రయ్య, టేకుల ఆనంద్, గన్నారం మల్లేష్, టేకుల ఆగమయ్య, బండ గోపాల్, పూజారి ప్రభాకర్, అడివయ్య, ఎంఆర్ఎఫ్ రాంచందర్, టేకుల భూపాల్, నాయకులు మజీద్, సీనియర్ నాయకులు రఫీ, షఫీ, బిక్షపతి గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనార్టీ మహిళలు, పార్టీ కార్యకర్తలు, రాజంపేట ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని ఈ సందర్భంగా అభ్యర్థి సుష్మిత ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...