సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 30 (SNM NEWS):సంగారెడ్డి లోని 12 వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహితీ రాము తమ వార్డు ప్రజలు వెంటరాగా ఇంటి నుండి మున్సిపాలిటీ వరకు ర్యాలీ గా వెళ్లి నామినేషన్ వేశారు.వార్డు ప్రజల ఆశీర్వాదంతో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు తనను గెలిపిస్తాయని అన్నారు. వార్డులో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తాను గెలిస్తే కాలనీలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కచ్చితంగా పూర్తి చేస్తానని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ నిధులు ఉపయోగించి కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తామని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాకు సేవ చేయడమే తెలుసని తనను గెలిపిస్తే వార్డు సర్వతో ముఖాభివృద్ధికి సర్వదా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Friday, January 30, 2026
12 వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ రాము
Subscribe to:
Post Comments (Atom)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment