Friday, January 30, 2026

12 వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ రాము


సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 30 (SNM NEWS):సంగారెడ్డి లోని 12 వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహితీ రాము తమ వార్డు ప్రజలు వెంటరాగా ఇంటి నుండి మున్సిపాలిటీ వరకు ర్యాలీ గా వెళ్లి నామినేషన్ వేశారు.వార్డు ప్రజల ఆశీర్వాదంతో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు తనను గెలిపిస్తాయని అన్నారు. వార్డులో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తాను గెలిస్తే కాలనీలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కచ్చితంగా పూర్తి చేస్తానని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ నిధులు ఉపయోగించి కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తామని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాకు సేవ చేయడమే తెలుసని తనను గెలిపిస్తే వార్డు సర్వతో ముఖాభివృద్ధికి సర్వదా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...