భారీ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరిక
సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 29 (SNM NEWS) :
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గొల్ల ఆంజనేయులు విజయలక్ష్మి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించి, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ర్యాలీ సందర్భంగా నినాదాలతో వార్డు ప్రాంతమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అభ్యర్థికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని గొల్ల ఆంజనేయులు విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనార్దన్, పండు అన్న, అరుణ్ చారీ, అఖిల్, తూర్పు ఆంజనేయులు తదితరులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


No comments:
Post a Comment