సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్):: కంది మండలం కౌలంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి స్వాతి శ్రీశైలంకు మద్దతుగా ప్రచారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని శ్రీశైలం గత 20 ఏళ్లుగా పార్టీలో ఉండి పని చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి నిజాయితీ, సేవాభావం ఉన్న నాయకత్వం గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో స్వాతి శ్రీశైలంను గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, డ్రైనేజి, రేషన్ కార్డులు, యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు, రెండు వాటర్ ఫ్లాంటు తదితర సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కౌలంపేట గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి సాధ్యమైనంత మేర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుందిగల్ల రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Tuesday, December 09, 2025
కౌలంపేటలో స్వాతి శ్రీశైలంకు మద్దతుగా నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...
No comments:
Post a Comment