సంగారెడ్డి, డిసెంబర్ 9(SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో మానస ప్రవీణ్ యాదవ్ మంగళవారం ప్రచారాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రచారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు ఆయన వెంట చేరి ఊరంతా జెండాలు, నినాదాలతో సందడి చేశారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రవీణ్ యాదవ్ ప్రజలకు అభివాదం చేస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు గ్రామంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. మామిడిపల్లిలో తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కాలువల శుభ్రత వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రచారం పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Tuesday, December 09, 2025
మామిడిపల్లిలో మానస ప్రవీణ్ యాదవ్ ప్రచారం
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...
No comments:
Post a Comment