Tuesday, December 30, 2025

ఎస్‌జీజీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థికి సర్టిఫికెట్ ప్రదానం -యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం – ఎస్‌జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు


సంగారెడ్డి, డిసెంబర్ 29 (SNM NEWS): వికారాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీజీఎఫ్ అండర్–17 బాయ్స్ ఫుట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న కేంద్రీయ విద్యాలయ ఎద్దు మైలారం పాఠశాల విద్యార్థి గడ్డమీది సాయి సిద్ధార్థ గౌడ్‌కు సంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ, పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడపై మాట్లాడిన ఎస్‌జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభావంతమైన యువ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహకారం అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...